అదే పేరుతో మ‌రోసారి మ‌హేష్ బాబు

  • IndiaGlitz, [Friday,June 22 2018]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స్థాయిని అమాంతంగా పెంచేసిన చిత్రం 'పోకిరి'. 2006లో విడుద‌లైన ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం ప‌తాక స‌న్నివేశాల్లో కృష్ణ మ‌నోహ‌ర్‌గా సంద‌డి చేశారు మ‌హేష్‌. ఆ సినిమాకి ముందు, త‌రువాత మహేష్ న‌టించిన చిత్రాల్లో కృష్ణ అనే పాత్ర పేరు మ‌రెక్క‌డా వినిపించ‌లేదు. మ‌ళ్ళీ 12 ఏళ్ళ త‌రువాత అదే పేరుతో మ‌హేష్ న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మ‌హేష్ పాత్ర పేరు కృష్ణ అని తెలిసింది. త‌న తండ్రి కృష్ణ పేరుని తొలిసారిగా పెట్టుకున్న పోకిరి ఘ‌న‌విజ‌యం సాధించిన‌ట్లే.. ఈ సినిమా కూడా ఘ‌న‌విజ‌యం సాధిస్తుందేమో చూడాలి. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా సంద‌డి చేయ‌నుంది.

More News

ప్రతి భారతీయుడు గర్వించదగ్గ చిత్రం 'టిక్ టిక్ టిక్'

"టిక్ టిక్ టిక్ " విడుదలకు ముందు వరకు అంతరిక్షం నేప‌థ్యంలో రూపొందిన తొలి ఇండియ‌న్ మూవీ గా అందరీ దృష్టిని ఆకర్షించింది.ట్రైలర్ చూడగానే గ్రావిటీ ,ఇంటర్ స్టెల్లార్ లాంటి సినిమాల

హీరో శ్రీవిష్ణు కొత్త చిత్రం ప్రారంభం

"రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్",  "కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్" బ్యానర్సపై "శ్రీ ఓం సినిమా" సమర్పణలో కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వంలో

తండ్రి టి.కృష్ణ భావాల‌ను పుణికి పుచ్చుకున్న హీరో గోపీచంద్ 'పంతం' పెద్ద హిట్ కావాలి - దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం 'పంతం'. ఎన్నో హిట్‌ చిత్రాలకు వర్క్‌ చేసిన ప్రముఖ రచయిత కె. చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో

ఆగ‌స్టులో రానున్న విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రాలు

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్ళి చూపులు చిత్రాలతో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

మ‌హేష్ సినిమాలో అదితిరావ్ హైద‌రీ?

స‌మ్మోహ‌నం చిత్రంతో ఆక‌ట్టుకున్న క‌థానాయిక అదితి రావ్ హైద‌రీ. ఇందులో స‌మీరా రాథోడ్‌గా న‌టించి.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిందీ ముద్దుగుమ్మ‌.