ఫ్యామిలీతో అమెరికా బయలుదేరిన మహేశ్‌

  • IndiaGlitz, [Sunday,November 08 2020]

ఈరోజు ఉదయం సూపర్‌స్టార్‌ మహేశ్‌ తన కుటుంబం(నమ్రత, గౌతమ్‌, సితార) సహా అమెరికా బయలుదేరారు. ఎయిర్‌పోర్టులో మహేశ్‌ ఫ్యామిలీతో ఉన్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. మహేశ్‌కు ఏమాత్రం ఖాళీ ఉన్నా కుటుంబానికి తన పూర్తి సమయాన్ని కేటాయిస్తారు. అది ఆయన ఫ్యామిలీకి ఇచ్చే ప్రాధాన్యత. వీలున్నప్పుడల్లా కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళుతుంటారు. కొవిడ్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన మహేశ్‌ ఇటీవల కొన్నియాడ్‌ షూటింగ్స్‌ కోసం బయటకు వచ్చారు. ఈ షూటింగ్స గట్రా పూర్తయిన తర్వాత మహేశ్‌ అమెరికా ఫ్లైట్‌ ఎక్కేశారు.

మహేశ్‌ 27వ చిత్రం 'సర్కారువారిపాట' యూనిట్‌ రెగ్యులర్‌ షూటింగ్‌కు సన్నద్ధం అవుతోంది. తొలి షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించబోతున్నారు. సినిమాలో 40 శాతం చిత్రీకరణ అమెరికాలోనే జరగనుందట. అందుకోసం 45 రోజుల పాటు షెడ్యూల్‌ ప్లానింగ్‌ రెడీ అయ్యింది. జనవరి నుండి యూనిట్‌ అమెరికా వెళుతుందని వార్తలు కూడా వినిపించాయి. కానీ యూనిట్‌ కంటే ముందుగానే మహేశ్‌ అమెరికా బయలుదేరేశాడు. దాదాపు రెండు నెలల సమయం ఉంది. అంత వరకు మహేశ్‌ అమెరికాలో ఉండబోతున్నాడు. క్రిస్మస్‌ వేడుకలు, న్యూ ఇయర్‌ వేడుకలను మహేశ్ అమెరికాలోనే సెలబ్రేట్‌ చేసుకోబోతున్నాడని క్లియర్‌గా అర్థమవుతుంది.

More News

వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సుమ.. అసలు నిజమిదే..!

బిగ్‌బాస్ సీజన్ 4 ఆదివారం రిలీజ్ చేసిన ప్రోమో చూసి అంతా షాక్ అయ్యారు. యాంకర్ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నారంటూ ప్రోమోలో చూపించారు.

జారిన ప్యాంటు.. ఆగిన పెళ్లి..

పెళ్లికి బంధువులనందరినీ పిలుచుకున్నారు. వైభవంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. వధువు మెడలో పూల మాల వేసే సమయంలో డామిట్ కథ అడ్డం తిరిగింది. వధువు మెడలో పూలమాల వేసే సమయంలో వరుడి ప్యాంటు జారింది..

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో మరో వ్యక్తి ఆత్మహత్య

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. కుషాయిగూడలో చెట్టుకు ఉరేసుకుని నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

డిసెంబ‌ర్‌లో ప‌వ‌న్‌తో శ్రుతి..!

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. బోనీక‌పూర్‌, దిల్‌రాజు నిర్మాత‌లు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ షెడ్యూల్‌లో ప‌వ‌న్‌, ఇత‌ర

యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో 'రాధేశ్యామ్‌'

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ స్పీడుగా ‘రాధేశ్యామ్‌’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రీసెంట్‌గా ఇటలీలో కీల‌క షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇండియా చేరుందీ టీమ్‌. త‌దుప‌రి షెడ్యూల్‌కు