ఆ డైరెక్ట‌ర్ కి మ‌హేష్ మాటిచ్చాడ‌ట‌..

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఈ మూవీ షూటింగ్ జ‌రుపుకుంటుది. స‌మ్మ‌ర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ త‌ర్వాత మ‌హేష్ మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు.

ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ తో మూవీ చేయ‌డానికి శేఖ‌ర్ క‌మ్ముల ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటీవ‌ల మ‌హేష్ కి శేఖ‌ర్ క‌మ్ముల క‌థ చెప్పాడ‌ట‌. క‌థ విని మహేష్ పూర్తి స్ర్కిప్ట్ రెడీ చేయ‌మ‌న్నాడ‌ట‌. మ‌హేష్, శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్లో మూవీని మ‌రో డైరెక్ట‌ర్ జయంత్ సి ప‌రాన్జీ నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇటీవ‌ల మ‌హేష్ ని క‌ల‌సిన జయంత్ కి మ‌నం ఖ‌చ్చితంగా సినిమా చేద్దాం అంటూ మ‌హేష్ మాట ఇచ్చాడ‌ట‌. ఇక శేఖ‌ర్ క‌మ్ముల క‌థను పూర్తిగా రెడీ చేయ‌డమే మిగిలింది. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే మురుగుదాస్ మూవీ షూటింగ్ లో ఉండ‌గానే ఈ మూవీని ప్రారంభించే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.

More News

చెన్నైప్రజలకు తారల చేయూత

చెన్నైలో కురుస్తున్న వర్షాలకు జనం నానా అవస్థలు పడుతున్నారు.గత వందేళ్లలో ఎన్నడు లేని విధంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమై సేవా కార్యక్రమాలు చేపట్టింది.

సుమంత్ విక్కీ డోన‌ర్ రీమేక్ వివ‌రాలు..

అక్కినేని మ‌న‌వ‌డు యార్ల‌గ‌డ్డ సుమంత్ ప్రేమ‌క‌థ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై..స‌త్యం, గౌరి, పౌరుడు, గోల్కండ హైస్కూల్ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి మెప్పించాడు.

త‌మిళ‌నాడు వ‌ర‌ద భాదితుల‌కు 5 ల‌క్షల విరాళం ప్రక‌టించిన ర‌వితేజ‌

ఇటీవ‌ల కాలంలో త‌మిళ‌నాడు మెత్తం విస్త్రుత‌మైన వ‌ర్షాల కార‌ణం గా రాష్ట్రమంతా ప్రజ‌ల తీవ్రమైన ఇబ్బందుల‌కు గురైన విష‌యం తెలిసిందే. దీనికి స్పందించిన మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ 5 ల‌క్షల విరాళం ప్రక‌టించారు.

వరద బాధితులకు ఎన్టీఆర్ సపోర్ట్

తమిళనాడులో ప్రజలు అకాల వర్షాలతో వరదల భారిన పడ్డారు. ప్రజలు ప్రాథమిక అవసరాల కోసం నానా కష్టాలు పడుతున్నారు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నామంటూ ముందుకు వచ్చే సినీ పరిశ్రమ ఈసారి కూడా తమ వంతుగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

ఫ్యాన్స్ కోసం రజనీ ప్లాన్స్...

సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12.రజీనీ పుట్టినరోజు అభిమానులకు పండుగ రోజు.తమిళనాడులోనే కాకుండా దేశ విదేశాల్లో రజనీ ఫ్యాన్స్ ఉన్నారు.