మహేశ్ లవ్‌స్టోరీ.. మ్యూజిక్ ఎవ‌రంటే?

  • IndiaGlitz, [Friday,April 17 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, మ‌హేశ్‌కి క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆగిపోయింది. వంశీ పైడిప‌ల్లి స్థానంలో ప‌రుశురామ్ చేరాడు. క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. కాబ‌ట్టి ప‌రుశురామ్‌కు కావాల్సినంత టైమ్ దొరికింది. స్క్రిప్ట్‌ను మరింతగా మెరుగులు దిద్దే ప‌నిలో ప‌డ్డాడీ ద‌ర్శ‌కుడు. సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 31న సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసి జూలైలో రెగ్యుల‌ర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.

తాజా స‌మాచారం మేర‌కు మ‌హేశ్ 27వ సినిమా మేచ్యూర్డ్ ల‌వ్ స్టోరి అని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. శ్రీమంతుడులో మ‌హేశ్ మెచ్యూర్డ్ ల‌వ‌ర్‌బోయ్‌గా క‌న‌ప‌డ్డాడు. త‌ర్వాత ఆయ‌న చేసిన భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాల్లో ప్రేమ అనే అంశం ట‌చ్ చేశారంతే! కానీ ప‌రుశురామ్ మాత్రం త‌న‌దైన స్టైల్లో మ‌హేశ్‌ను డిఫ‌రెంట్ ల‌వ‌ర్‌బోయ్‌గా చూపించ‌బోతున్నాడ‌ట‌. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే మ‌హేశ్ న‌టించిన గ‌త మూడు చిత్రాల‌కు సంగీతం అందించిన దేవిశ్రీని ప‌క్క‌న పెట్టి ప‌రుశురామ్ త‌న‌కు న‌చ్చిన గోపీ సుంద‌ర్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంచుకున్నాడ‌ని స‌మాచారం.

More News

శ్రియ‌పై సిల్లీ కామెంట్స్‌.. ఆమె భ‌ర్త ఏమ‌న్నాడంటే..?

తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన శ్రియ ఇప్పుడు త‌న ల‌వ‌ర్ అండ్రూ కొచ్చిన్‌ను పెళ్లి చేసుకుని సెటిలైంది. వీరిద్ద‌రూ స్పెయిన‌ల్‌లో క్వారంటైన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

అప్పుడు.. ఇప్పుడు బన్నీ!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల‌వుతుంది.

ఎన్టీఆర్‌ డ‌బుల్ ట్రీట్ ఇస్తాడా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు మే 20. ఈ రోజున ఎన్టీఆర్ అభిమానులకు డ‌బుల్ ట్రీట్ ఇస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

చిరుతో క‌లిసి న‌టించ‌నున్న స్టైలిష్ స్టార్‌..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను పూర్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోవాల‌నుకోవ‌డం లేద‌ట‌.

తెలుగు సినీ కార్మికులకు అమితాబ్ అండ

కరోనా ప్రభావంతో ప్రపంచమంతా స్తబ్దుగా మారింది. మన దేశం విషయానికి వస్తే మే 3 వరకు లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో సామాన్య ప్ర‌జ‌లు, సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు.