మహేశ్‌ న్యూ ఇయర్‌ ప్లానింగ్‌..!

  • IndiaGlitz, [Saturday,October 31 2020]

సూపర్‌స్టార్‌ మహేశ్‌ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఏమాత్రం తీరిక దొరికినా కుటుంబంతో సమయాన్ని గడపడటానికి చూస్తారు. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళుతుంటారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన మహేశ్‌ తదుపరి తన 27వ చిత్రం 'సర్కారువారిపాట'కు సన్నద్ధమవుతున్నారు. తొలి షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించబోతున్నారు. సినిమాలో 40 శాతం చిత్రీకరణ అమెరికాలోనే జరగనుందట. అందుకోసం 45 రోజుల పాటు షెడ్యూల్‌ ప్లానింగ్‌ రెడీ అయ్యింది. ఇప్పుడు వీసా పనులు జరుగుతున్నాయి. అంతా ఓకే అయితే, యూనిట్‌ అంతా జనవరి మొదటివారంలో అమెరికా చేరుకుంటారట.

అయితే అంత కంటే ముందుగానే అంటే డిసెంబర్‌ చివరి వారంలోనే మహేశ్‌ కుటుబంతో కలిసి అమెరికా చేరుకుంటాడట. అమెరికాలోనే న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ ప్లాన్‌ చేశాడట మహేశ్‌. కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. ఇందులో విల‌న్ ఇండియాలోని బ్యాంకుల‌ను మోసం చేసి అమెరికా పారిపోతాడు. అక్క‌డ నుండి విల‌న్‌ను ఇండియా ర‌ప్పించి ప్ర‌తి పైసాను బ్యాంకుకు చెల్లించేలా హీరో మ‌హేశ్ చేస్తాడనేదే కథాంశమని వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

More News

పవర్‌స్టార్‌ సినిమాలో మరో హీరో ఈగ విలనేనా..?

ఈగ చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించిన కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ తర్వాత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారారు.

చరణ్‌ రికార్డ్‌..!

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పేరిట ఓ రికార్డ్ సొంతమైందని మెగాభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

పవన్‌కల్యాణ్‌ అడుగు పెట్టేది రేపే!!

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత న‌టిస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’.

గాంధీ, నెహ్రులను విమర్శించిన కంగనా రనౌత్‌

శనివారం ఐరన్‌మ్యాన్‌ సర్దార్ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి.

నగల దొంగను పట్టిచ్చిన వాట్సాప్...

దొంగతనం జరిగిన 15 నెలల తరువాత దొంగ అనూహ్యంగా పట్టుబట్టాడు. ఈ దొంగతనం కేసును పోలీసులు ఛేదించలేదు.