మ‌హేష్ సినిమా అప్‌డేట్స్‌...

  • IndiaGlitz, [Wednesday,November 29 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'భ‌ర‌త్ అను నేను'(రిజిష్ట‌ర్డ్ టైటిల్‌). డివివి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుద‌ల చేస్తున్నారు. సినిమా దాదాపు వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రికంతా పూర్తి చేయాల‌నేది చిత్ర యూనిట్ ప్లాన్‌.

అందులో భాగంగా న‌వంబ‌ర్ 30 నుండి డిసెంబ‌ర్ 7వ‌ర‌కు హైద‌రాబాద్‌లో ఓ షెడ్యూల్‌, డిసెంబ‌ర్ 10 నుండి డిసెంబ‌ర్ 25 వ‌ర‌కు కారైకూడి షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీంతో పాటు జ‌న‌వ‌రిలో మూడు పాట‌లు, ఓ ఫైట్ చిత్రీక‌ర‌ణ చేసి షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసేస్తార‌ట‌. త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేస్తార‌ట‌.

ఈ సినిమాలో మ‌హేష్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. 'శ్రీమంతుడు' సినిమా తర్వాత మ‌హేష్‌, కొర‌టాల కాంబినేష‌న్‌లో రానున్న సినిమా కాబ‌ట్టి సినిమాపై భారీ అంచ‌నాలే నెలకొన్నాయి.

More News

వివ‌ర‌ణ ఇచ్చుకున్న త్రిష‌...

చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న త్రిష‌..విక్ర‌మ్‌, హ‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'సామి స్క్వేర్' లో నుండి త‌ప్ప‌కుంది.  అస‌లు త్రిష ఎందుకు త‌ప్పుకుంద‌నే దానిపై త్రిష త‌న పాత్ర‌కు త‌గ్గ ప్రాధాన్యత సీక్వెల్‌లో లేద‌ని తెలియ‌డంతో త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం.

టెలివిజ‌న్ సిరీస్ స్ఫూర్తితో వెంకీ, తేజ చిత్రం?

నేనే రాజు నేనే మంత్రితో ప‌దిహేనేళ్ల త‌రువాత విజ‌యాన్ని అందుకున్నారు ద‌ర్శ‌కుడు తేజ‌. ప్ర‌స్తుతం ఆయ‌న రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్నారు.

మూడు రోజుల పండ‌గ

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ క్రిస్మ‌స్ ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. పండ‌గ సంద‌ర్భంలో వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఆస‌క్తిక‌ర‌మైన సినిమాలు విడుద‌ల కానుండ‌డ‌మే అందుకు కార‌ణంగా చెప్పొచ్చు.

6 కోట్లకు అల్లు శిరీష్ ఒక్క క్షణం ఆంధ్రా హక్కులు

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ డైరెక్షన్ లో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్

పవన్ ని ఆకాశానికెత్తేసిన కీర్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ నిన్న కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ వారణాసిలో ఆఖరి షెడ్యూల్ జరుపుకుంటోంది.