తిరుప‌తిలో మ‌హేష్‌

  • IndiaGlitz, [Saturday,September 12 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు. శ్రీమంతుడు స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మ‌హేష్ ఈ నెల 16 నుంచి బ్ర‌హ్మోత్స‌వం షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే బ్ర‌హ్మోత్స‌వం ఫ‌స్ట్ షెడ్యూల్ ను తిరుప‌తిలో ప్లాన్ చేసారు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రించే కుటుంబ క‌ధా చిత్రంగా బ్ర‌హ్మోత్స‌వం ను రూపొందిస్తున్నారు.

ఫ‌స్ట్ షెడ్యూల్ లో మ‌హేష్ తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొంటార‌ని స‌మాచారం. ఈ నెల 16 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో పి.వి.పి సంస్థ నిర్మిస్తుంది.సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రానికి సంగీతాన్ని అందించిన మిక్కీ జె మేయ‌రే బ్ర‌హ్మోత్స‌వం చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు.