Mahesh Babu: థ్యాంక్యూ మై హోమ్‌టౌన్ గుంటూరు.. మహేష్ ఎమోషనల్ పోస్ట్..

  • IndiaGlitz, [Wednesday,January 10 2024]

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న 'గుంటూరు కారం' సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి గుంటూరులో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రతి సంక్రాంతికి మా సినిమాలు బ్లాక్‌బాస్టర్ అయ్యాయి. ఈసారి కూడా గట్టిగా కొడుతున్నాం. అయితే ఈసారి నాన్న లేని లోటు మాత్రం ఉంది. ఇక నుంచి అభిమానులే నాకు అమ్మ, నాన్న.. ఏదైనా ఇక మీరే అని చెబుతూ తీవ్ర భావోద్వేగానికి అయ్యారు.

తాజాగా ఈ ఈవెంట్‌ సక్సెస్‌పై స్పందిస్తూ మహేష్, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. థ్యాంక్యూ గుంటూరు. నా సొంత పట్టణంలో నా సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం మీరు అందించిన ఈ ప్రేమ, ఈ జ్ఞాపకాలు నా హృదయాన్ని హత్తుకున్నాయి. లవ్ యూ ఆల్. నా సూపర్ ఫ్యాన్స్ అందర్నీ త్వరలో మళ్లీ కలుస్తాను. సంక్రాంతి మొదలైంది. ముఖ్యంగా గుంటూరు పోలీసులకు, వారు ఇచ్చిన మద్దతుకి ప్రత్యేక ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు.

ఇక మహేష్ భార్య నమ్రత కూడా ఈ ఈవెంట్‌కి సంబంధిచిన ఓ వీడియోని షేర్ చేశారు. మహేష్ బాబు తన అభిమానుల పట్ల ఎంత ప్రేమగా ఉంటారో మాట్లాడటానికి నేనే చివరి వ్యక్తిని కావొచ్చు. ఎల్లప్పుడూ రెండు రాష్ట్రాల్లోని ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు మహేష్ పట్ల ప్రేమ చూపిస్తుంటారు. మహేష్ చేసే అన్ని ప్రయత్నాలలోనూ మీరు మద్దతుగా ఉండి అతడి సినిమాల కోసం ఇంకా కష్టపడేలా చేస్తారు.

కానీ గుంటూరులో మహేష్‌కి, అతని టీంకి మీరిచ్చిన ఆదరణ చూసిన తర్వాత గర్వంగా చెప్పగలను మహేష్ బాబు.. అభిమానులకు ఒక ఎమోషన్. ఈ అభిమానం, ప్రేమ మీ కుటుంబ సభ్యులుగా మాకు ఎల్లప్పుడూ ఉండాలి. మేము మా ప్రేమని మీకు అన్ని మార్గాల్లోనూ అందిస్తాము. మీరు కూడా మా ప్రేమని స్వీకరిస్తారు అని భావిస్తున్నాను. మహేష్‌ని ఇంతగా ప్రేమించే మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మహేష్, నమ్రత సోషల్ మీడియా పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా సంక్రాంతి కానుకగా ఈనెల 12 'గుంటూరు కారం' సినిమా థియేటర్లలోకి విడుదల కానుంది.

More News

Kesineni Nani: వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని.. జగన్‌తో భేటీ..?

ఎన్నికల వేళ విజయవాడ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. టీడీపీకి దూరమైన ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది.

Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులకు గాయాలు..

హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. చెన్నైలోని తాంబరం నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది.

Mahesh Babu: ఇక నుంచి మీరే అమ్మ, నాన్న.. 'మావా ఎంతైనా' అంటున్న మహేష్..

మరో రెండు రోజుల్లో 'గుంటూరు కారం' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా యూనిట్ ప్రమోషన్స్‌ను హోరెత్తిస్తోంది. మంగళవారం రాత్రి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను

Film Chamber: సంక్రాంతి సినిమాల వివాదం.. మీడియాకు ఫిల్మ్‌ ఛాంబర్ వార్నింగ్..

ఈసారి సంక్రాంతికి సినిమాల విడుదల విషయంలో గతంలో ఎన్నడూ లేని వివాదాలు తలెత్తుతున్నాయి. ఈసారి పోటీ విపరీతంగా ఉండటంతో హనుమాన్ సినిమాకు థియేటర్ల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిదంటూ జోరుగా

Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'గుంటూరు కారం' బెనిఫిట్ షోకు గ్రీన్ సిగ్నల్..

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన "గుంటూరు కారం'సినిమా. సంక్రాంతి పండుగ కానుకగా ఈనెల 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.