మహేష్.. మళ్లీ పవన్ డేట్ ?

  • IndiaGlitz, [Wednesday,October 18 2017]

శ్రీ‌మంతుడు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ చిత్రాల‌తో సంద‌డి చేశాడు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు. అయితే ఆ రెండు సినిమాలు కూడా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న శ్రీ‌మంతుడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో భ‌ర‌త్ అను నేను అనే సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వేస‌వి కానుక‌గా విడుదల కానుంది. కాగా, తాజాగా ఈ చిత్రానికి ఏప్రిల్ 20ని విడుద‌ల తేదిగా ఫిక్స్ చేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

విశేష‌మేమిటంటే.. అదే తేదిన 2000లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ బ‌ద్రి రిలీజ్ అయ్యింది. మ‌రి ప‌వ‌న్ కి అచ్చొచ్చిన తేది మ‌హేష్ కి కూడా క‌లిసొస్తుందేమో చూడాలి. అన్న‌ట్టు.. ఇటీవ‌లే వ‌చ్చిన మ‌హేష్ స్పైడ‌ర్ కూడా ప‌వ‌న్ న‌టించిన అత్తారింటికి దారేది విడుద‌ల తేది అయిన సెప్టెంబ‌ర్ 27నే వ‌చ్చింది. స్పైడ‌ర్‌కి క‌లిసి రానిది.. భ‌ర‌త్ అను నేను కైనా క‌లిసొస్తుందేమో చూడాలి.