మ‌హేశ్ డబుల్ ధ‌మాకా?

  • IndiaGlitz, [Saturday,July 18 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ చిత్రం స‌ర్కారువారి పాట‌. ఈ ఏడాది సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రుతో మ‌హేశ్ సూప‌ర్‌హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. దాని త‌ర్వాత ప్రారంభ‌మైన స‌ర్కారు వారి పాట రెగ్యుల‌ర్ షూటింగ్‌కు విల‌న్‌గా క‌రోనా అడ్డు ప‌డింది. ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగిన త‌ర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో బ్యాంకుల‌ను మోసం చేసి పారిపోయిన విల‌న్‌ను తిరిగి ఇండియాకు ర‌ప్పించి డ‌బ్బులు వ‌సూలు చేయిస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు తాజా సోష‌ల్ మీడియా వ‌ర్గాల అప్‌డేట్ ప్ర‌కారం మ‌హేశ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌ట‌.

ఇదే క‌నుక నిజ‌మైతే ఇన్నేళ్ల కెరీర్‌లో మ‌హేశ్ ద్విపాత్రాభిన‌యం చేసే తొలి చిత్ర‌మిదే అవుతుంది. రెండింటిలో ఓ పాత్ర కాస్త నెగటివ్ ట‌చ్ ఉన్నట్లు సాగుతుంద‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై మ‌హేశ్ అండ్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై సినిమా రూపొందనుంది.

More News

37 ఏళ్ల త‌ర్వాత ఆ బ్యాన‌ర్‌లో మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మించాల‌ని నిర్మాతలు భావిస్తుంటారు. ఆయ‌న చేసిన 150 చిత్రాల్లో చాలా మందినిర్మాత‌ల‌తో

సుశాంత్ ఆత్మతో మాట్లాడాడట.. వీడియో వైరల్

సుశాంత్ రాజ్‌పుత్ అకాల మరణం పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్..

భారత్ బయోటెక్ అభివ‌ృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే.

అక్కడ థియేటర్స్‌కు పర్మిషన్ వచ్చేసింది.. మరిక్కడ?

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికీ కూడా కష్టాల్లో ఉన్న పరిశ్రమ ఏదైనా ఉందంటే..

వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి కరోనా పాజిటివ్..

ఏపీలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలోని రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు.