మహేష్ ఇంకోటి తీసుకున్నారు

  • IndiaGlitz, [Monday,September 28 2015]

మహేష్ ఇప్పుడు రెండో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన ఇంతకు మునుపే ఆంధ్రప్రదేశ్ గుంటూరుజిల్లాలో తన తండ్రి పుట్టి పెరిగిన బుర్రిపాలెం విలేజ్ ను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయన మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపురంను తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కేటీఆర్ తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్పారు.

సామాజిక సేవలో ఎప్పుడూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే మహేష్ ఇలా గ్రామాలను దత్తత తీసుకోవడం ఆనందంగా ఉందని ఆయన అభిమానులు అంటున్నరు. 12 అంశాల ప్రాతిపదికన ఆయన బుర్రిపాలెం విలేజ్ ను అభివృద్ధి చేయాలనుకున్నారు. అదే విధానాన్ని సిద్ధాపురం గ్రామానికి కూడా అమలు చేస్తారని టాక్ వినిపిస్తోంది.