డ‌బ్బింగ్ పూర్తి చేసిన మ‌హేశ్‌

  • IndiaGlitz, [Friday,December 27 2019]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టిస్తోన్న 26వ చిత్రం 'స‌రిలేరు నీకెవ్వ‌రు'. దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్ ఇది. ప్యాచ్ వ‌ర్క్ స‌హా చిత్రీక‌ర‌ణను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అందులో భాగంగా మ‌హేశ్ డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసేశార‌ట‌. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌.

మ‌హేశ్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. జ‌న‌వ‌రి 5న హైద‌రాబాద్ ఎల్‌.బి.స్టేడియంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భ‌ర‌త్ నేను, మ‌హ‌ర్షి చిత్రాల త‌ర్వాత మ‌హేష్ న‌టిస్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

More News

విజయసాయి మాటకు లెక్కలేకుండా పోయిందా!?

నవ్యాంధ్ర మూడు రాజధానులపై ఎంపీ విజయసాయిరెడ్డి ఓ మాట.. తాజాగా మంత్రి పేర్ని నాని మరో మాట చెప్పారు.

సీబీఐ రంగంలోకి దిగితే వైసీపీ, టీడీపీ నేతల పరిస్థితేంటి!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ వర్సెస్ టీడీపీ అధినేత చంద్రబాబుగా పరిస్థితులు మారనున్నాయా..?.

రాజధాని మార్చే అధికారం మీకెక్కడిది!?: చంద్రబాబు

ఏపీ కెబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

అమరావతి రైతులకు హామీ ఇచ్చిన మంత్రి నాని

నవ్యాంధ్రకు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ ప్రకటనతో అమరావతి ప్రాంతంలో రైతులు రాస్తారోకోలు, ర్యాలీకి దిగారు.

ఏపీ కెబినెట్‌లో ఏం చర్చించారు.. కీలక నిర్ణయాలేంటి!?

నవ్యాంధ్రకు మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ కెబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.