షూటింగ్‌ను ఆపేసిన మ‌హేశ్ అండ్ టీమ్‌..!

  • IndiaGlitz, [Tuesday,March 30 2021]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ లేటెస్ట్ మూవీ ‘స‌ర్కారువారిపాట‌’. ప‌రశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రీసెంట్‌గానే యూనిట్ దుబాయ్ షెడ్యూల్‌ను షురూ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్‌ను యూనిట్ ఆపేసింద‌ట‌. అందుకు కార‌ణం.. కోవిడ్ సెకండ్ వేవ్ అని స‌మాచారం. సెకండ్ వేవ్‌లో క‌రోనా కేసులు ఎక్కువ‌గా పెరుగుతున్న క్ర‌మంలో దుబాయ్ షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేసుకున్న యూనిట్‌.. త‌ర్వాత గోవాలో షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. అయితే.. భార‌త్‌లోనూ క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో యూనిట్ ప్ర‌స్తుతానికి షూటింగ్‌లో హోల్డ్‌లో పెట్టేసింది.

హీరో తండ్రిని మోసం చేసి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టి విదేశాల‌కు పారిపోయిన విల‌న్‌ను ఇండియాకు రప్పించే హీరో క‌థే ఇది అని టాక్ వినిపిస్తోంది. కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది. ఇందులో మహేశ్ రెండు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.

More News

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి నిధి అగ‌ర్వాల్ ఏమందంటే..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లేటెస్ట్‌గా రెండు సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో బిజి బిజీగా ఉన్నారు. ఇందులో ఓ సినిమా ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’.

హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్న అల్లు శిరీష్!

మెగా హీరో అల్లు శిరీష్ గురించి ఓ వార్త ఇండటస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి గాసిప్స్ ఇండస్ట్రీకేం కొత్త కాదు కానీ..

ప్రియమైన వారి నుంచి ఉంగరం అందిందంటూ రష్మిక పోస్ట్..

నటి రష్మిక తాజాగా ఓ బహుమతి అందుకుంది. అది ఎవరి నుంచి అనేది తెలియదు కానీ ఆ గిఫ్ట్‌ని చూశాక ఆమె ఆనందానికి అవధుల్లేవని తెలుస్తోంది.

డ్రైవర్‌కు కరోనా.. మహేష్ ఫ్యామిలీ టెస్ట్ చేయించుకోగా..!

కరోనా సెకండ్ వేవ్ సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

‘వకీల్ సాబ్’ ట్రైలర్‌ విడుదల సమయంలో ఫ్యాన్స్ బీభత్సం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.