ఏప్రిల్‌ 6న 'మహర్షి' టీజర్‌ విడుదల

  • IndiaGlitz, [Friday,April 05 2019]

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌ 'ఛోటి ఛోటి చోటి ఛోటీ బాతే.. మీటి మీటి మీటి మీటీ యాదే..'కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా, ఏప్రిల్‌ 6 ఉదయం 9.09 గంటలకు ఈ చిత్రం టీజర్‌ను ఉగాది కానుకగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవన్‌ ఎకర్స్‌లో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 9న సమ్మర్‌ స్పెషల్‌గా వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్‌ మూవీకి కె.యు.మోహనన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్‌, సునీల్‌బాబు, కె.ఎల్‌.ప్రవీణ్‌, రాజు సుందరం, శ్రీమణి, రామ్‌-లక్ష్మణ్‌ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

More News

'ప్రశ్నిస్తా' చాలా గొప్పగా ఉంటుంది: ఆర్. నారాయణమూర్తి

మనీష్  బాబు హీరోగా రాజా వన్నెంరెడ్డి  దర్శకత్వంలో  జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి. సత్యారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ప్రశ్నిస్తా. అక్షిత, హసీస్, షిప్రా కౌర్

క‌ల్యాణ్‌రామ్ ఇంకో సినిమా

క‌ల్యాణ్‌రామ్ ఇప్పుడు మాంచి స్పీడు మీదున్నారు. వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్ప‌టికే ఆయ‌న న‌టించిన మూడు సినిమాలు విడుద‌ల‌య్యాయి.

పాప తండ్రిగా ర‌వితేజ‌

ర‌వితేజ హీరోగా `క‌న‌క‌దుర్గ‌` అనే సినిమా మొద‌లుకానుంది. ఈ సినిమాకు సంతోష్ శ్రీన్‌వాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఆర్టీసీ బస్‌లో కోట్లు తరలిస్తూ అడ్డంగా దొరికిన వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంటంతో నేతలు ఓటర్లను ప్రలోభాలు పెడుతున్నారు.

భూమనను ఎదుర్కోవాలంటే 'మాయా' లాగా మారాలి!

"సోద‌రి మాయావ‌తి ప్ర‌ధానిగా తిరిగి తిరుప‌తిలో అడుగుపెట్టాలి. మాయావ‌తి గారు ఎన్నో క‌ష్టాలుప‌డి వంద‌ల కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కి, రాజ‌కీయాల‌కు వేల కోట్లు అవ‌స‌రం లేదు.