సెన్సార్ వారి మెప్పు పొందిన 'మహానటి' 

  • IndiaGlitz, [Friday,May 04 2018]

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ప్రపంచ వ్యాప్తంగా మే 9 న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది 'మహానటి'. సెన్సార్ వారు క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా చిత్రం పై ప్రశంసల జల్లు కురిపించారు. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మహానటి చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నత సాంకేతిక విలువలతో ప్రియాంక దత్ స్వప్న సినిమాస్ మరియు వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు.

చిత్రంలో కీర్తి సురేష్ అచ్చు గుద్దినట్లు సావిత్రి గారిలా ఉండటం, టీజర్ మరియు పాటలకు విశేష స్పందన రావడంతో 'మహానటి' పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ పాత్ర పోషిస్తుండగా  సమంత, విజయ్ దేవరకొండలు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డా. మోహన్ బాబు, డా. రాజేందర్ ప్రసాద్, మాళవిక నైర్, భాను ప్రియా, షాలిని పాండే, దివ్య వాణి, శ్రీనివాస్ అవసరాల ఇతర ప్రధాన పాత్రలలో కనిపిస్తారు.

ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్

More News

'మెహబూబా' సెన్సార్‌ పూర్తి - మే 11 విడుదల

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో

పాట చిత్రీక‌ర‌ణ‌లో..'తేజ్ ఐ లవ్ యు'

ప్రేమ‌క‌థా చిత్రాల‌ స్పెషలిస్ట్ ద‌ర్శ‌కుడు ఎ.కరుణాకరన్.. ప్రేమకథలను తనదైన శైలిలో వెండి తెరపై చూపడంలో నేర్పరి.

శ‌ర్వా కోసం భారీ సెట్‌

శ‌ర్వానంద్‌, సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.  ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది.

'2.0' మ‌రింత ఆల‌స్యం

శివాజీ, రోబో చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కాంబినేష‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ది. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడో చిత్రం '2.0'.

రాజ్ త‌రుణ్‌కు ప్ల‌స్ అవుతారా?

యువ క‌థానాయ‌కుడు రాజ్ తరుణ్ సినిమాలో తల్లి పాత్రలు చాలా ప్రభావం చూపిస్తాయి.