సెన్సార్ పూర్తి చేసుకున్న 'మాగ్నెట్'

  • IndiaGlitz, [Tuesday,October 09 2018]

విడుదల అయిన ఒక్క ఫస్ట్ లుక్ తోనే కుర్రకారులో అంచనాలు పెంచేసిన చిత్రం మాగ్నెట్. ఈ మధ్యే ఈ సినిమా యూనిట్ సాక్షి చౌదరి హాట్ లుక్ విడుదల చేశారు, మరోసారి ఈ సినిమాతో సాక్షి చౌదరి యూత్ కి అందాల విందు ఇవ్వనుంది అని అర్ధమవుతుంది. కాగా వివరాల్లోకి వెళ్తే, సాక్షి చౌదరి ప్రధాన కథానాయకగా ఏ. ఎమ్.ఏస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాగ్నెట్.

సాక్షి చౌదరితో పాటు ముఖ్య పాత్రలలో పోసాని కృష్ణ మురళి, అభినవ్ సర్దార్, భరణి, అక్షిత, సందీప్తి, అప్పారావు తదితరులు లు నటిస్తూ, లవ్ రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా లార్డ్ శివ క్రియేషన్స్ బ్యానర్ పై ఏం.శివా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో భారి విడుదలకు సిద్ధం అవుతుంది. అయితే, ఈ చిత్రానికి కెమెరా శంకర్, మ్యూజిక్ డాక్టర్ కిషన్, ఎడిటర్ - నందమూరి హరి, ఆర్ట్ విజయ్ కృష్ణ, లిరిక్స్ రామ్ పైడిసేట్టి, శ్రీ గణేష్, రచన – దర్శకత్వం ఎమ్.ఏస్ రెడ్డి.