మంచు విష్ణు సంచలన నిర్ణయం.. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో 11 మంది సభ్యుల రాజీనామాలకు ఆమోదం

  • IndiaGlitz, [Sunday,December 12 2021]

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యుల రాజీనామాలను ఆమోదించారు. వీరి స్థానంలో 11 మంది కొత్త వారిని తీసుకుంటామని మంచు విష్ణు ప్రకటించారు. 'మా' లో ఒక పదవిలో కొనసాగుతున్న వ్యక్తి స్థానం ఖాళీ అయితే ఆ స్థానాన్ని భర్తీ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేసిన శ్రీకాంత్‌ స్థానంలో బాబూమోహన్‌ను నామినేట్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని కోరమని గుర్తుచేశారు. వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నామని.. అయితే నాగబాబు, ప్రకాశ్ రాజ్‌లు మా సభ్యులుగానే కొనసాగుతారని విష్ణు తెలిపారు. వారంలో మా భవనంపై ప్రకటిస్తామని.. మా భవనం కోసం చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ‘మా’ ఎన్నికలు ఉత్కంఠగా జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం జరిగిన పోరులో ప్రకాశ్‌రాజ్‌పై విష్ణు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి 11 మంది విజయం సాధించినప్పటికీ.. విష్ణు ప్యానల్‌ సభ్యులతో కలిసి పనిచేయలేమంటూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నామని ఆనాడే ప్రకటించిన విషయం తెలిసిందే. మొద‌ట‌ రాజీనామాలు చేయొద్దని, ఆ లేఖలు వెనక్కి తీసుకోవాలని విష్ణు కోరాడు. అయిన‌ప్ప‌టికీ వారు వినిపించుకోక‌పోవ‌డంతో వారి రాజీనామాల‌ను ఆమోదిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు : సెకండ్ ఫైనలిస్ట్‌గా సన్నీ... బిగ్‌బాస్ హౌస్‌లో హిట్ ఎవరు, ఫ్లాప్ ఎవరు..?

బిగ్‌బాస్ 5 తెలుగు తుది అంకానికి చేరుకుంది. శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి...

ప్రాజెక్ట్ కే : ప్రభాస్-దీపికా పదుకొణే- అమితాబ్‌ల బిగ్గెస్ట్‌ మూవీ స్టార్ట్.. ఫస్ట్ షార్ట్ వీడియో వైరల్

వరుస సినిమాలతో బిజీగా వున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో

త‌గ్గేదేలె..  ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ ‘‘పుష్ప’’ దూకుడు, రూ.250 కోట్ల పైమాటే..!!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఆసుపత్రిలో చేరిన తమిళ హీరో శింబు.. కరోనా అంటూ ప్రచారం, క్లారిటీ ఇచ్చిన సన్నిహితులు

తమిళ యువనటుడు శింబు అనారోగ్యంతో చెన్నయ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. దాంతో ఆయనకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

బిబిసి, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ భాగ‌స్వామ్యంతో జీ5 నిర్మిస్తున్న వెబ్ సిరీస్ 'గాలివాన‌'

'జీ 5'... ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి! ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో మనసులను తాకే కథలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది.