'మా' ఎన్నికలు: బీజేపీదే అధికారం.. సీవీఎల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్

  • IndiaGlitz, [Saturday,July 03 2021]

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహారావు 'మా'ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తెలంగాణ వాదంతో ఎన్నికల బరిలో దిగుతున్నారు. మా అసోసియేషన్, టాలీవుడ్ లో తెలంగాణ ఆర్టిస్టులకు అన్యాయం జరుగుతోందని సీవీఎల్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఏపీలో కూడా పేద ఆర్టిస్టులకు న్యాయం జరగడం లేదు. మా అసోసియేషన్ ని ఏపీ, తెలంగాణ రెండుగా విభజించాలి అనే డిమాండ్ తో సీవీఎల్ మా ఎన్నికల బరిలోకి దిగారు. సివిల్ నరసింహారావు బిజెపి మద్దతు దారుడు. బిజెపి కూడా నరసింహారావుకు మా ఎన్నికలో మద్దతు తెలిపింది.

తాజాగా సివిఎల్ తెలంగాణ బిజెపి నేతలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో బిజెపి నేత వెంకటరమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా ఎన్నికలపై వారు చేసిన రాజకీయ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

మా ఎన్నికల్లో రాజకీయ కోణం తెరపైకి వస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా ప్రభుత్వం నంది అవార్డులు ఇవ్వలేదని వెంకట రమణి విమర్శించారు. నంది అవార్డులు ఎందుకు ఇవ్వలేదో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని సమాధానం చెప్పాలని అన్నారు.

ఇక సివిఎల్ మాట్లాడుతూ ఇంకాస్త ఆసక్తికర రాజకీయ వ్యాఖ్యలు చేశారు. 2023లో తెలంగాణాలో అధికారంలోకి వచ్చేది బీజేపీ నే అని అన్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక అంతర్జాతీయ ఫిలిం, టెలివిజన్ ఇన్స్టిట్యూట్ లు ఏర్పాటు చేస్తాం అని అన్నారు. తెలంగాణ సినిమాలకు వినోదపు పన్ను మినహాయింపు ఉంటుందని, అలాగే ప్రతి తెలంగాణ సినిమాకు రూ 50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు సివిఎల్ నరసింహా రావు.

త్వరలో జరగబోయే మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం సివిఎల్.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత లతో తలపడబోతున్నారు.

More News

హాట్ ఫోటోస్: దివి నుంచి దిగివచ్చిన దేవతలా పాయల్ హొయలు

పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రోల్ తో యువతలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

ఏం చదివినా నమ్మకండి అంటూ నవీన్ పోలిశెట్టి ట్వీట్!

కెరీర్ ఆరంభంలో నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్ రోల్స్ చేశాడు. ఇప్పుడు హీరోగా రెండు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశాడు.

రాంచరణ్, శంకర్ సినిమాకు లైన్ క్లియర్.. హైకోర్టు నుంచి బిగ్ రిలీఫ్

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 చిత్రం ప్రారంభించినప్పటి నుంచి అనేక చిక్కులు మొదలయ్యాయి.

బ్యూటిఫుల్ పిక్స్: యష్, రాధికా దంపతుల కొత్త ఇంటి గృహ ప్రవేశం !

కెజిఎఫ్ సక్సెస్ తో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. తాజాగా యష్, రాధికా పండిట్ దంపతులు జీవితంలో సంతోషకరమైన కొత్త అడుగు వేశారు.

బ్రేకింగ్: విడిపోయిన అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు.. షాక్ లో బాలీవుడ్

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ జీవితంలో ఊహించని పరిణామం ఎదురైంది.