ఈనెల‌ 26న వస్తున్న 'లక్కున్నోడు'

  • IndiaGlitz, [Monday,January 23 2017]

మంచు విష్ణు-హన్సిక జంటగా తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ "లక్కున్నోడు". "గీతాంజలి" ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ అందుకొంది. ఎం.వి.వి సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. "రోమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు రాజ్ కిరణ్ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డైమండ్ రత్నబాబు స్క్రీన్ ప్లే-మాటలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి. "దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద" లాంటి సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్ తర్వాత విష్ణు-హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం కావడంతోపాటు, "ఈడోరకం ఆడోరకం" వంటి సూపర్ హిట్ అనంతరం మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం అవ్వడంతో "లక్కున్నోడు"పై మంచి అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. సినిమా కూడా అదే స్థాయిలో వారిని అలరిస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఈనెల‌ 26న ప్రపంచవ్యాప్తంగా "లకున్నోడు" చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మా బ్యానర్ లో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది" అన్నారు.

తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు-ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్ ప్లే-మాటలు: డైమండ్ రత్నబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రెడ్డి విజయ్ కుమార్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ-దర్శకత్వం: రాజ్ కిరణ్

More News

సూర్య‌ S3 విడుద‌ల వాయిదా

సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటించిన‌ చిత్రం "S3-య‌ముడు-3". ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు.  ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు.

జనవరి 26న 'గుంటూరోడు' ఆడియో విడుదల

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా,బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా,

కంట్రోల్ తప్పిన ప్రకాష్ రాజ్...

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మీడియా ప్రతినిధిపై తన కోపాన్ని ప్రదర్శించాడు.అందుకు కారణమేంటో తెలుసుకోవాలంటే ...

ధృవ‌, శాత‌క‌ర్ణి భామ ఫ‌రా..!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రంలో అరవింద్ స్వామి నెగిటివ్ రోల్ చేసిన విష‌యం తెలిసిందే. అర‌వింద్ స్వామి ల‌వర్ పాత్ర పోషించిన న‌టి ఫ‌రా.

ఎ.పి స్పెష‌ల్ స్టేట‌స్ కోసం యూత్ ప్లాన్..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త కొన్ని రోజులుగా త‌న వాద‌న‌ను వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.