శాంతించిన ఓపీఎస్.. ఈపీఎస్‌కు లైన్ క్లియర్..

  • IndiaGlitz, [Wednesday,October 07 2020]

గత కొద్ది రోజులుగా హాట్ హాట్‌గా నడుస్తున్న తమిళ రాజకీయాల్లో ఎట్టకేలకు ప్రశాంతత నెలకొంది. సీఎం అభ్యర్థి నిర్ణయంపై అన్నాడీఎంకేలో చెలరేగిన వివాదం సీనియర్‌ మంత్రులు, పార్టీ నేతల రాజీ యత్నాలతో రాజీ యత్నాలతో సమసిపోయింది. పార్టీ ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి, సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం మధ్య తలెత్తిన విభేదాలు సద్దుమణిగాయి. సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించాలంటే.. తనను ప్రకటించాలంటూ నిన్న మొన్నటి వరకూ ఈపీఎస్, ఓపీఎస్‌లు పట్టుబట్టిన విషయం తెలిసిందే. పార్టీ నేతల రాజీ యత్నాలతో పన్నీర్ సెల్వం శాంతించడంతో పళని స్వామికి లైన్ క్లియర్ అయింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని బుధవారం అధికారికంగా ప్రకటించనున్నారు.

గత నెల 28న అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో వివాదం చెలరేగింది. పార్టీ ముఖ్య నేతలైన పళనిస్వామి, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం వాగ్వాదానికి దిగడంతో పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు అవాక్కయ్యారు. అప్పటి నుంచి పన్నీర్ సెల్వం కాస్త పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో పార్టీ నేతలు రంగ ప్రవేశం చేసి.. పన్నీర్ సెల్వంతో పలు విడతలుగా చర్చలు జరిపి ఆయనను శాంతింపజేసేందుకు యత్నించారు. అనంతరం పన్నీర్ సెల్వం తన స్వస్థలమైన పెరియకులంలోని కైలాసపట్టి ఫామ్‌హౌస్‌లో తన మద్దతుదారులతో పలు విడతలుగా మంతనాలు జరిపారు. అనంతరం గత ఆదివారం చెన్నైకు తిరిగి వచ్చారు.

చెన్నైకు రాగానే పార్టీ సీనియర్లతో పన్నీర్ సెల్వం చర్చలు జరిపారు. పార్టీ భవిష్యత్ కోసం సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో పట్టు సడలించాలని పన్నీర్ సెల్వంను పార్టీ నేతలు కోరారు. దీనికి ప్రతిగా పన్నీర్‌సెల్వం కోరుతున్నట్లు 11 మందితో మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేయిస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. బుధవారం సీఎం అభ్యర్థిని ప్రకటించిన సమయంలోనే మార్గదర్శక కమిటీ ఏర్పాటు గురించి కూడా ప్రకటన చేయాలని పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు. అందుకు పార్టీ నేతలు అంగీకరించడంతో పన్నీర్ సెల్వం దిగి వచ్చారు. మార్గదర్శక కమిటీలో ఎడప్పాడి వర్గానికి చెందిన ఐదుగురు, పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన ఐదుగురు సభ్యులుగా ఉంటారు. ఏ వర్గానికి చెందని తటస్థంగా ఉండే సీనియర్‌ నాయకుడిని మరో సభ్యుడిగా నియమించనున్నారు. దీంతో అన్ని అడ్డంకులు తొలిగిపోయి నేడు పార్టీ సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని.. మార్గదర్శక కమిటీని నేడు అధికారికంగా ప్రకటించనున్నారు.

More News

నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు: పార్థసారధి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను నవంబర్ లేదంటే డిసెంబర్ నెలల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు.

క్రేజీ కాంబినేష‌న్‌...!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. తదుప‌రి సినిమా ఏంట‌నే దానిపై క్లారిటీ లేదు. అనుష్క ప‌లానా చిత్రంలో న‌టిస్తుందంటూ సోష‌ల్ మీడియాలో

అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును ప్రకటించిన పన్నీర్ సెల్వం

అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును అధికారికంగా ప్రకటించారు. నిన్న మొన్నటి వరకూ ఉన్న విభేదాలన్నింటినీ పక్కనపెట్టి పళని స్వామి పేరును డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వమే

‘రంగ్ దే’ షెడ్యూల్ పూర్తి చేసిన నితిన్ అండ్ టీమ్‌

నితిన్, కీర్తిసురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ సినిమా ఫైన‌ల్ ద‌శ షూటింగ్‌కు చేరుకుంది.

అటు సీక్రెట్ టాస్క్.. ఇటు బీబీ గ్రాండ్ హోటల్

నామినేషన్స్ అనంతరం జరిగిన సీన్స్‌తో షో స్టార్ట్ అయింది. ఏడుపులు.. ఓదార్పులు నామినేషన్ తరువాత కూడా కొనసాగాయి.