Mudragada: జగన్‌ను మరోసారి సీఎంగా చేసుకుందాం.. ప్రజలకు ముద్రగడ బహిరంగ లేఖ..

  • IndiaGlitz, [Monday,March 11 2024]

జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ఏపీ సీఎంగా చేసుకుందామంటూ రాష్ట్ర ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఈనెల 14న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నానని ప్రకటించారు.

ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికి తెలుసు అని అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వై.యస్.ఆర్.సి.పిలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. ఇందుకు మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను. మరోసారి జగన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడానికి కృషి చేస్తాను. ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి పని చేయాలని నిర్ణయించాను.

జగన్‌ ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతోపాటు, అభివృద్ధిని చేయించాలని ఆశతో ఉన్నాను. మీ బిడ్డను అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. చేయను కూడా. ఈనెల 14న వై.యస్.ఆర్.సి.పిలోకి చేరనున్నాను. ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లి అక్కడ జగన్ సమక్షంలో పార్టీలో చేరుతాను. కిర్లంపూడిలో బయల్దేరి ప్రత్తిపాడు, జగ్గంపేట, లాలా చెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తాడేపల్లి చేరుకుంటాను. ఈ ప్రయాణంలో మీరు కూడా పాలుపంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నాను. అయితే నాతో పాటు వచ్చే వారు మీకు కావాల్సిన ఆహారం, ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోవాలని కోరుతున్నాను అంటూ లేఖలో వెల్లడించారు.

కాగా ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోర్డినేటర్ మిథున్ రెడ్డి.. ముద్రగడ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో పార్టీలో చేరడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు.

కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముద్రగడ తొలుత వైసీపీలో చేరాలని భావించారు. కానీ సీఎం జగన్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో నిర్ణయం ఉపసంహరించుకున్నారు. ఇదే సమయంలో జనసేన నేతలు ముద్రగడను కలిశారు. త్వరలోనే పవన్ కల్యాణ్ కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలిపారు. దీంతో ఆయన జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే పవన్ నుంచి పిలుపురాకపోవడంతో అలకబూనారు.

ఈ క్రమంలోనే టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయడానికి ఒప్పుకుంది. దీనిపై ముద్రగడ పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభ వేదికగా తనకు ఎవరూ సలహాలు ఇవ్వొద్దని జనసేనాని స్పష్టంచేశారు. దీంతో ముద్రగడ జనసేనకు దూరం అవుతున్నట్లు మరో లేఖ పవన్‌కు రాశారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని.. ఒకవేళ ఆయన పోటీ చేయకుండా కుమారుడు పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. తాజాగా ఈనెల 14న వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

More News

Naatu Naatu: ఆస్కార్ వేదికపై మరోసారి 'నాటునాటు' పాట.. నగ్నంగా స్టేజ్ పైకి వచ్చిన నటుడు..

ఆస్కార్ అవార్డ్స్ వేడుక అమెరికాలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మన తెలుగు పాట మరోసారి అలరించింది. గతేడాది RRR మూవీలోని 'నాటు నాటు' పాటకు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ అవార్డు

Oscars 2024: ఘనంగా ఆస్కార్-24 అవార్డ్స్‌.. సత్తా చాటిన ‘ఓపెన్‌హైమర్’

ప్రపంచ సినీ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్-2024 విజేతల పేర్లను అకాడమీ ప్రకటించింది. ప్రతిష్ఠాత్మక 96వ ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమం

15లక్షల మందితో 'సిద్ధం' సభ సూపర్ సక్సెస్.. ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు..

అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయింది. సీఎం జగన్‌ కోసం జనం తండోపతండాలుగా తరలివచ్చారు.

TDP: ఎన్టీఏలో చేరిన టీడీపీ.. అధికారికంగా ప్రకటించిన బీజేపీ..

NDAలో తెలుగుదేశం పార్టీ చేరినట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

Siddham in Addanki: మేదరమెట్లలో పోలికేకకు వైసీపీ 'సిద్ధం'.. ప్రజలందరి చూపు అటు వైపే..

మరో పోలికేకకు వైసీపీ సిద్ధమైంది. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున సిద్ధం సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారంలో ముందుంది.