RC15 క్రేజీ అప్డేట్.. ఆ మూవీ చూసి ఒక్క ఫోటో చాలనుకున్నా, అలాంటిది..

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ కాంబినేషన్ భారీ చిత్రానికి రంగం సిద్దమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ మూవీ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఇటీవలే దిల్ రాజు, రాంచరణ్ ఇద్దరూ చెన్నైకి వెళ్లి శంకర్ ని కలసి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఈ చిత్ర కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

స్టార్ రచయిత బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందించనున్నారు. సాయి మాధవ్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. శంకర్ ని కలసిన తర్వాత ఆయనతో దిగిన ఫోటో షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ చెప్పారు.

'జెంటిల్ మెన్ చూసినప్పుడు శంకర్ గారితో ఓ ఫోటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను. అలాంటిది ఆయన చిత్రానికి ఇప్పుడు మాటలు రాస్తున్నా. శంకర్ సర్ కి, దిల్ రాజు గారికి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు థ్యాంక్స్' అని బుర్రా సాయి మాధవ్ ట్వీట్ చేశారు.

బుర్రా సాయి మాధవ్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ రైటర్. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రానికి కూడా సాయిమాధవ్ మాటలు అందిస్తున్నారు. అనేక క్రేజీ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. చారిత్రాత్మక నేపథ్యం అయినా, సమకాలీన అంశాలు అయినా ఎలాంటి సిట్యువేషన్ లో అయినా పవర్ ఫుల్ డైలాగ్స్ అందించగల రచయిత సాయి మాధవ్. ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

More News

మేకప్ లేకుండా ఇలియానా బోల్డ్ ఫోజు.. బీచ్ లో హద్దులు దాటేసిందిగా..

గోవా బ్యూటీ ఇలియానా ఘాటు సొగసు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో

ఒళ్ళు గగుర్పొడిచేలా 'రాక్షసుడు 2' పోస్టర్.. లీడ్ రోల్ లో స్టార్ హీరో?

బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు చిత్రం గుర్తుందిగా. తమిళంలో విష్ణు విశాల్ నటించిన రాక్షసన్ చిత్రానికి రాక్షసుడు తెలుగు రీమేక్ గా తెరకెక్కింది. సైకో థ్రిల్లర్ గా తెరకెక్కిన.

పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం.. నాన్నగారి గురించి సునీల్ ని అడగండి: మంచు విష్ణు

త్వరలో జరగబోయే మా అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం రోజు రోజుకూ హీటెక్కుతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సివిల్ నరసింహారావు లాంటి ప్రముఖులు అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

జూలై 16న ఆహాలో 'కుడి ఎడమైతే'.. ఉత్కంఠగా టీజర్!

చిన్న, మీడియం బడ్జెట్ లలో థ్రిల్లర్ చిత్రాలకు ఓటిటిలు వేదికలుగా మారుతున్నాయి. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఓటిటి వేదికలలోకి సినిమాలు తీసుకువస్తున్నారు.

పోలీస్ గా, డాక్టర్ గా హీరో రామ్.. లింగుస్వామి మూవీ స్టోరీ లీక్?

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ మాస్ ఎంటర్టైనర్ కు రెడీ అవుతున్నాడు. లింగుస్వామి దర్శత్వంలో తెరకెక్కే చిత్ర షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ మాస్ హిట్ అందుకున్న