ఎస్పీ బాలు హెల్త్‌పై తాజా అప్‌డేట్..

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి క్రమ క్రమంగా మెరుగవుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌తో పాటు ఎంజీఎం వైద్య నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నారని.. రెస్పాండ్ అవుతున్నారని వైద్యులు తెలిపారు. ఎస్పీ చరణ్ కూడా ఓ వీడియో సందేశం ద్వారా ఇదే విషయాన్ని వెల్లడించారు.

‘‘కరోనా కారణంగా ఎంజీఎం హెల్త్ కేర్‌లో చేరిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ఆయన ఐసీయూలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన స్పృహలో ఉండటమే కాకుండా రెస్పాండ్ అవుతున్నారు. వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్యస్థితిని పర్యవేక్షిస్తోంది’’ అని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

‘‘నాన్నగారి ఆరోగ్యం విషయంలో రికవరీ దిశగా తొలి అడుగు పడింది. నాన్నగారు మెల్లగా రికవరీ అవుతారన్న నమ్మకం ఉంది. ఎంజీఎం హెల్త్ సెంటర్ మెడికల్ టీం మాకు ా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నిన్న మొన్నటితో పోలిస్తే ఆయన చాలా తెలివిగా ఉన్నారు. ఆయన నిన్నటి కంటే బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఆయన నాతో మాట్లాడేందుకు ట్రై చేశారు కానీ ఆయన ప్రాపర్‌గా మాట్లాడలేకపోతున్నారు. ఈ వారంలో ఆయన నాతో మాట్లాడుతారని నమ్ముతున్నా. ఆయన మ్యూజిక్ వింటున్నారు. పాడేందుకు ట్రై చేస్తున్నారు’’ అని చరణ్ తెలిపారు.

More News

క‌రోనాను జయించ‌డ‌మే మనంద‌రి ధ్యేయం - నంద‌మూరి బాల‌కృష్ణ‌

కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మెసులుకొని ఈ క‌రోనాను జ‌యించాల‌ని అగ్ర క‌థానాయ‌కుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్

సూర్య నిర్ణ‌యం డిస్ట్రిబ్యూట‌ర్స్ ఫైర్‌.. డైరెక్ట‌ర్ హ‌రి లేఖ‌

సూర్య‌.. త‌నే హీరోగా న‌టిస్తూ నిర్మించిన చిత్రం ‘శూర‌రై పోట్రు’. ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం నీ హ‌ద్దురా పేరుతో తెలుగులో

తమన్నా పేరెంట్స్‌కు క‌రోనా పాజిటివ్‌!!

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల‌తో పాటు హిందీ చిత్రాల్లోనూ న‌టించిన త‌మ‌న్నా భాటియా..

ప్ర‌భాస్ .. సీత ఎవ‌రు?

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌ను అనౌన్స్ చేస్తూ వ‌స్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో

డ్రగ్ డీలర్‌తో రియా చాటింగ్ గుట్టు రట్టు..

ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసు మొత్తం ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి చుట్టే తిరుగుతోంది.