లార్గన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగశౌర్య నూతన చిత్రం

  • IndiaGlitz, [Friday,February 12 2016]

కెరీర్‌ ప్రారంభం నుంచి లవ్‌స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాగశౌర్య ఇప్పుడు కథా బలమున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నూతన నిర్మాత రామ అక్కల ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లార్గన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందనున్న చిత్రమిది. పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన సాయి చైతన్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెలాఖరులో లాంచనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి మార్చిలో రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తారు.

రామ అక్కల పదేళ్లుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో పంపిణీదారులుగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు అక్కడ మల్టీప్లెక్స్‌ థియేటర్‌లను కూడా నిర్మిస్తున్నారు. న్యూజీలాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో విడుదలయ్యే భారీ బడ్జెట్‌ చిత్రాలన్నీ రామ రిలీజ్‌ చేసినవే. సినిమాపై వారికున్న ప్రేమతో కథాబలమున్న చిత్రాలను నిర్మించి ప్రేక్షకుల మన్ననలు పొందాలనే కాంక్షతో నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు. నాగశౌర్య హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులో సినిమా ప్రారంభించి మార్చిలో రెగ్యూలర్‌ షూటింగ్‌కి వెళ్తారు.

More News

ఆ నిర్ణ‌యాన్ని హీరోకే వ‌దిలేసిన సుకుమార్

నాన్న‌కు ప్రేమ‌తో...సినిమాతో సూప‌ర్ స‌క్సెస్ సాధించిన సుకుమార్...త‌దుప‌రి చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ తో చేయ‌డానికి ఫిక్స్ అయ్యారు.

కొత్త అవ‌తారంలో స‌రైనోడు

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా స‌రైనోడు సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు.

మ‌నోజ్ శౌర్య మూవీ రిలీజ్ డేట్..

మంచు మ‌నోజ్ న‌టిస్తున్న తాజా చిత్రం శౌర్య‌. ఈ చిత్రాన్ని ద‌శ‌ర‌థ్ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో మ‌నోజ్ స‌ర‌స‌న రెజీనా న‌టించింది.

తుంట‌రి టీజ‌ర్ రెస్పాన్స్

ప్రస్తుతం తెలుగులోకి పరిచయం అవుతున్న దర్శకులలో 100 లో 80% మంది రెగ్యులర్ మూస ధోరణి సినిమాలను లేదా హిట్ ఫార్ములాని నమ్ముకొని దర్శకులుగా పరిచయం కావడానికి ఇష్టపడుతున్నారు.

అరుణ్ సాగర్ మరణం తీరని టోటు - నందమూరి బాలకృష్ణ

అరుణ్ సాగర్ గారి మరణం చాలా బాధాకరం,తీరని లోటు.ఈ మధ్యనే ఆయన్ను కలిశాను.టీవీ ఛానెల్ ఎడిటర్ గా ఆయన అందించిన సేవలు మరువలేనివి.