విలన్ గా లారెన్స్....

  • IndiaGlitz, [Saturday,February 06 2016]

కొరియోగ్రాఫ‌ర్‌గా, ద‌ర్శ‌కుడుగా త‌న‌దైన స్టయిల్‌లో రాణిస్తున్న రాఘ‌వ‌లారెన్స్ ఇప్పుడు తెలుగు ప‌టాస్ రీమేక్ త‌మిళ్ వెర్ష‌న్‌లో హీరోగా నటిస్తున్నాడు. ఇది కాకుండా ఓ రెండు చిత్రాలు డైరెక్ట్ చేసే ప‌నిలో ఉన్నాడు. త‌ర్వలోనే విల‌న్‌గా కూడా క‌నిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. సిద్ధార్థ్‌, బాబీసింహ హీరో, విల‌న్‌గా న‌టించిన జిగ‌ర్ తండా సినిమాలో బాబీ సింహ ఏకంగా నేష‌న‌ల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట‌. ఈ సీక్వెల్‌లో బాబీ సింహ స్థానంలో లారెన్స్ విల‌న్‌గా క‌నిపిస్తాడని స‌మాచారం.