జనవరి1న 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'

  • IndiaGlitz, [Wednesday,December 09 2015]

నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్‌ బ్యానర్‌పై జగదీశ్‌ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్‌ కామినేని నిర్మించిన చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. ఈ చిత్రానికి సంగీతం ఎమ్‌. ఎమ్‌. కీరవాణి. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని న్యూ ఇయర్‌ 2016 కానుకగా జనవరి 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా

చిత్ర దర్శకుడు జగదీశ్‌ తలశిల మాట్లాడుతూ....''అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' రూపుదిద్దుకుంది. అల్రెడీ ఎస్‌.ఎస్‌. రాజమౌళిగారి చేతుల మీదుగా విడుదల అయిన ఆడియోకి శ్రోతల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఎమ్‌. ఎమ్‌. కీరవాణిగారు అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌ కానుంది. ఉత్కంఠ భరితంగా అన్ని కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. న్యూ ఇయర్‌ 2016 కానుకగా..జనవరి 1వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము...'' అన్నారు.

More News

మళ్లీ తెరపైకి ఛోటా మేస్త్రి..

డైరెక్టర్ సంపత్ నంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్లీ చరణ్ తో సినిమా చేయడానికి ఛోటా మేస్త్రి అనే టైటిల్ తో స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నానని గతంలో సంపత్ నంది ప్రకటించారు.

ఒక రోజు ముందే వస్తున్న లోఫర్..

నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం లోఫర్. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించారు.

అదేం లేదంటున్న దర్శకుడు...

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం డిక్టేటర్. అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్. సంక్రాంతి కానుకగా సినిమా జనవరి 14న విడుదలవుతుంది. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో అజయ్దేవగణ్ హీరోగా రీమేక్ చేస్తారని వార్తలు వినపడ్డాయి.

రామ్ న్యూమూవీకి వెరైటీ టైటిల్..

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన నేను శైలజ సినిమాని జనవరి 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ కందిరీగ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మరో అవకాశం దక్కించుకున్న కుమారి హీరోయిన్..

సుకుమార్ తొలి ప్రయత్నంగా నిర్మించిన కుమారి 21ఎఫ్ మూవీలో నటించిన హేబా పటేల్ తన నటనతో యూత్ ను బాగా ఆకట్టుకుంది.