జనవరి1న 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'

  • IndiaGlitz, [Wednesday,December 09 2015]

నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్‌ బ్యానర్‌పై జగదీశ్‌ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్‌ కామినేని నిర్మించిన చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. ఈ చిత్రానికి సంగీతం ఎమ్‌. ఎమ్‌. కీరవాణి. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని న్యూ ఇయర్‌ 2016 కానుకగా జనవరి 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా

చిత్ర దర్శకుడు జగదీశ్‌ తలశిల మాట్లాడుతూ....''అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' రూపుదిద్దుకుంది. అల్రెడీ ఎస్‌.ఎస్‌. రాజమౌళిగారి చేతుల మీదుగా విడుదల అయిన ఆడియోకి శ్రోతల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఎమ్‌. ఎమ్‌. కీరవాణిగారు అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌ కానుంది. ఉత్కంఠ భరితంగా అన్ని కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. న్యూ ఇయర్‌ 2016 కానుకగా..జనవరి 1వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము...'' అన్నారు.