లచ్చిందేవికి ఓ లెక్కుంది రిలీజ్ డేట్ ఫిక్స్..

  • IndiaGlitz, [Thursday,November 26 2015]

అందాల రాక్ష‌సి ఫేం న‌వీన్ చంద్ర‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి శిష్యుడు జ‌గ‌దీష్ తెర‌కెక్కించారు. సాయి ప్ర‌సాద్ కామినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. విభిన్న క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతాన్ని అందించారు. అందాల రాక్ష‌సి జంట న‌వీన్ చంద్ర‌, లావ‌ణ్య త్రిపాఠి మ‌ళ్లీ క‌ల‌సి న‌టించ‌డంతో ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది మూవీపై పాజిటివ్ టాక్ ఉంది. దీనికి తోడు ఫ‌స్ట్ లుక్, ట్రైల‌ర్ కి కూడా మంచి రెస్పాన్స్ ల‌భించింది. వైవిధ్య‌మైన ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 11న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి...అందాల రాక్ష‌సి పెయిర్ ఈసారి ఎలాంటి ఫ‌లితాన్ని సాధిస్తారో చూడాలి.

More News

ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసే సినిమా 'తను నేను' - హీరో సంతోష్‌ శోభన్‌

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను సన్‌షైన్‌ సినిమాస్‌ బేనర్‌పై నిర్మించిన అభిరుచిగల నిర్మాత రామ్మోహన్‌ పి.

అవికా అంటే అంతేనా

'ఉయ్యాలా జంపాలా' సినిమా కోసం హీరోయిన్‌గా ట‌ర్న్ అయిన బుల్లి తెర న‌టి అవికా గోర్‌. ఆ త‌రువాత 'ల‌క్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్తా మావ' చిత్రాల్లో న‌టించింది.

'బాహుబలి 2' భారీ షెడ్యూల్..

బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం స్రుష్టించడంతో బాహుబలి 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఆ అంచనాలకు దీటుగా బాహుబలి 2ను తెరకెక్కించేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు జక్కన్న.

మహేష్ మూవీకి టాప్ సినిమాటోగ్రాఫర్...

సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం మూవీలో నటిస్తున్నవిషయం తెలిసిందే.శనివారం నుంచి తాజా షెడ్యూల్ ను రామోజీ ఫిలింసిటీలో ప్రారంభించనున్నారు.

న్యూమూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్...

హీరో నితిన్ ప్రస్తుతం అ..ఆ సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు శ్రీనివాస్ దర్శకత్వంలో రాథాక్రిష్ణ నిర్మిస్తున్నారు.