ఈ నెల 15 న వస్తున్న లచ్చి

  • IndiaGlitz, [Wednesday,December 13 2017]

ఓ ప్రముఖ ఛానెల్లో వెన్నెల అనే పోగ్రాం ద్వారా బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన జ‌య‌తి మెట్ట‌మెదటిసారిగా హీరోయిన్ గా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ల‌చ్చి. J9 4షోస్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఈశ్వ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. హార్ర‌ర్ కామెడీ లో వైవిధ్యాన్ని ఈ చిత్రం ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నారు. డిసెంబర్ 15న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌, క‌థానాయిక జ‌య‌తి మాట్లాడుతూ... "చాలా టీవి ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేసిన అనుభవంతో మెట్ట‌మెద‌టిసారిగా సినిమా నిర్మాణం చేపట్టాను. అలాగే ఈ చిత్రం క‌థ న‌చ్చి నేను మెయిన్ లీడ్ లో న‌టించాను. హార్ర‌ర్ కామెడీ చిత్రాలు చాలానే వచ్చాయి. కానీ లచ్చి చిత్రం కొత్త అనుభూతిని అందిస్తుంది. వైవిధ్యమైన కథ, కథనం ప్రేక్షకుల్ని థ్రిల్ కు గురి చేస్తుంది. ఈ చిత్రం అంతా ల‌చ్చి పాత్ర చుట్లూనే తిరుగుతుంది. అనేక మలుపులు ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తాయి. ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ కడుపుబ్బా నవ్విస్తారు. అలాగే లెజెండ్ కెమెరామెన్ యం.వి.ర‌ఘు గారితో ప‌నిచేయ‌టం చాలా ఆనందంగా వుంది. ఆయ‌న ఈచిత్రాన్ని మ‌రో మెట్టుకి తీసుకువెళ్ళారు. మాట‌లు మరుదూరి రాజా గారు అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 15న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా చిత్రాన్ని అంద‌రూ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాము. అని అన్నారు.

More News

రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జ్ సెన్సార్ పూర్తి

శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ... ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్.

అప్పుడు ర‌చ‌యిత‌..ఇప్పుడు డైరెక్ట‌ర్‌...

వెంక‌టేష్ సూప‌ర్ హిట్ సినిమాల్లో ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేని సినిమా 'నువ్వు నాకు న‌చ్చావ్'. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. కె.విజ‌య్‌భాస్క‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ మాట‌లు అందించాడు.

మ‌హేష్ సినిమా సినిమాటోగ్రాఫ‌ర్ మారుతున్నాడా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'భ‌ర‌త్ అను నేను'( విన‌ప‌డుతున్న పేరు). కైరా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది. డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 27న సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

విశాల్ సినిమా వాయిదా?

మాస్‌ హీరో విశాల్‌ ఇటీవల విడుదలైన 'డిటెక్టివ్‌'తో మరో సూపర్‌హిట్‌ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'అభిమన్యుడు'.

సినిమాల్లోకి హీరోయిన్ కుమారుడు

చిరంజీవి, బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబు ఇటా స్టార్స్‌తో న‌టించిన హీరోయిన్ సుమ‌ల‌త అందరికీ గుర్తుండే ఉంటుంది. క‌న్న‌డ న‌టుడు అంబ‌రీష్‌ను వివాహం చేసుకుని సెటిలైంది.