విజయవాడలో 'ఎల్7' టీమ్ హల్ చల్

  • IndiaGlitz, [Monday,August 08 2016]

రాహుల్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఆదిత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్‌ 7'. పూజా జావేరి కథానాయిక. ముకుంద్‌ పాండే దర్శకుడు. బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి నిర్మాత. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ చిత్రం టీమ్‌ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో పలు కాలేజ్‌లను సందర్శించి బ్లడ్‌ క్యాంపులను నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం విజయవాడలో హల్‌ చేశారు.

దీని గురించి నిర్మాత మాట్లాడుతూ ''శనివారం విజయవాడలోని పలు ప్రాంతాల్లో హెల్త్‌ క్యాంపులను నిర్వహించాం. అక్కడి ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వచ్చింది. ఇక సినిమా విషయానికొస్తే... లవ్‌, కామెడీ, హారర్‌ అంశాలతో ఏడు భిన్న కథలతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేమలో ఏడు కోణాల్ని చూపించే ప్రయత్నం చేశాం. ఆదిత్‌కు కరెక్ట్‌గా యాప్ట్‌ అయ్యే కథ ఇది. అతని క్యారెక్టర్‌ సినిమాకు హైలైట్‌ అవుతుంది. పూజా నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేస్తుంది. ఇటీవల విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌లకు చక్కని స్పందన వచ్చింది. పాటలు కూడా అదే రీతిలో ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాం. త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి నెలాఖరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరా: దుర్గాప్రసాద్‌, సంగీతం: అరవింద్‌ శంకర్‌, ఆర్ట్‌: నాగసాయి, సమర్పణ: మాస్టర్‌ ప్రీతమ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌, కో.ప్రొడ్యూసర్‌: బి.మోహనరావు, సతీష్‌ కొట్టె.

More News

వెంకటేష్ కెరీర్లో నువ్వు నాకు న చ్చావు, మల్లేశ్వరి చిత్రాల తరువాత ఫుల్ ప్లేడ్జ్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ బాబు బంగారం - కథా రచయిత డార్లింగ్స్ స్వామి

విక్టరి వెంకటేష్,నయనతార జంటగా నటించిన చిత్రం బాబు..బంగారం.ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కించారు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న అరకు రోడ్ లో...

సాయిరాం శంకర్,నికీషా పటేల్ హీరో,హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ రచన,దర్శకత్వంలో

సింగం-3 తెలుగు హక్కులు దక్కించుకున్న మల్కాపురం శివకుమార్!

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3.

వాళ్లిద్దరూ దేవుళ్లు అయితే నేను భక్తుడిని - డైరెక్టర్ పరుశురామ్

అల్లు శిరీష్,లావణ్య జంటగా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు.

'పెళ్లిచూపులు' శాటిలైట్ హ‌క్కులు ఎంతంటే'

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రీతూవ‌ర్మ జంట‌గా తరుణ్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన చిత్రం పెళ్ళిచూపులు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సురేష్ బాబు విడుద‌ల చేసిన ఈ చిత్రం అన్నీ చోట్ల నుండి పాజిటివ్ టాక్‌ను రాబ‌ట్టుకుంది.