ఓ మూర్ఖపు భక్తుల్లారా.. రాముడి పేరును అపవిత్రం చేయకండి..!

  • IndiaGlitz, [Saturday,August 03 2019]

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ మతం ఆధారంగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు కావాలనే పనిగట్టుకుని మరీ ఈమెపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. అయితే ఓపిక నశించి పోయిన ఖుష్బూ రంగంలోకి దిగారు. ఇలా తనపై.. తన మతంపై విమర్శలు గుప్పిస్తున్న వారిపై సవాల్ విసిరారు. ముస్లింను కాబట్టి తనను జిహాదీగా విమర్శిస్తున్నారని.. మీకు దమ్ముంటే మీ అసలు ఫొటోలతో, గుర్తింపుతో విమర్శించాలని ఈ సందర్భంగా ఖుష్బూ సవాల్ విసిరారు.

ట్విట్టర్ వేదికగా రియాక్షన్..

మీరు చేసే దూషణలు నాపై ఎలాంటి ప్రభావమూ చూపవు. నేను భారతీయురాలిని. నేను భారతీయురాలిగానే పుట్టాను.. భారతీయురాలిగానే మరణిస్తాను. ఓ మూర్ఖపు భక్తుల్లారా.. రాముడి పేరును అపవిత్రం చేయకండి. కొంచెమైనా సిగ్గుపడండి అని ఖుష్బూ ఘాటుగా విమర్శించారు.

అసలు ఎవరీ ఖుష్బూ!

ఇదిలా ఉంటే.. ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్ అన్న విషయం తెలిసిందే. ఈమె ఒక్క గొప్ప హేతువాది, ప్రజల పట్ల సమాజం పట్ల, చాలా మంచి అవగాహన ఉంది. ఆమె ఒక్క ముస్లిం కుటుంబంలో పుట్టి తరువాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1997లో దర్శకుడు సుందర్‌ను వివాహం చేసుకున్నారు. సినిమాల్లోకి వచ్చాక తన పేరును మార్చుకుని ఖుష్బూగా చెలమణీ అవుతున్నారు. ఇటు రాజకీయాల్లో.. అటు సినిమాల్లో ఖష్బూ రాణిస్తున్నారు.

ఇదీ అసలు కథ..!

కాగా గత కొన్ని రోజులుగా హిందువు కాదని ఆన్‌లైన్ ఆర్డర్స్ రద్దు చేయడం.. యాంకర్‌ ముస్లిం అని మాట్లాడకపోవడం.. కారు రైడ్‌ను రద్దు చేయడం ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కొందరు పనిగట్టుకుని మరీ సోషల్ మీడియా వేదికగా ముస్లిం ప్రముఖులను రెచ్చగొడుతున్నారు. ఇలా తనపై విమర్శలు గుప్పిస్తుండటంతో సోషల్ మీడియా వేదికగా ఖుష్బూ ఇలా రియాక్ట్ అయ్యారు. ఈమె రియాక్షన్‌తో పలువురు అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం మరింత డోస్ పెంచి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు.

More News

'కథనం' ట్రైలర్ లాంచ్

ది గాయత్రి ఫిలిమ్స్ మరియు ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కథనం'.

మళ్లీ వార్తల్లోకి ప్రభాస్ పెళ్లి..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఒకరైన ప్రభాస్ పెళ్లి గురించి ఎక్కడా ఊసెత్తం లేదు. నాలుగు పదుల వయసును ఈ స్టార్ రీచ్ కాబోతున్నాడు.

25 గెటప్స్‌లో విక్రమ్

పాత్రలోని కొత్తదనాన్ని నటన పరంగానే కాదు.. లుక్ పరంగానూ కొత్తగా చూపించే ప్రయత్నం చేసే నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు.

సంక్రాంతి కామెడీ ట్రైన్ సిద్ధమవుతోంది : అనీల్ రావిపూడి

సూపర్‌స్టార్ మహేశ్, డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`.

రేణుదేశాయ్ తప్పుకున్నారా?

నటి రేణుదేశాయ్, పవన్ కల్యాణ్ నుండి విడిపోయిన తర్వాత దర్శకురాలిగా నిలదొక్కుకొనే ప్రయత్నం చేశారు కానీ..