'కుమారి 21ఎఫ్' రిలీజ్ వాయిదా

  • IndiaGlitz, [Wednesday,October 14 2015]

విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మాతగా చేస్తున్న తొలి ప్ర‌య‌త్నం కుమారి 21 ఎఫ్‌. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్‌, హీబా ప‌టేల్ జంట‌గా న‌టించారు. సుకుమార్ శిష్యుడు సూర్య‌ప్ర‌తాప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాజ్ త‌రుణ్ తో సుకుమార్ నిర్మించిన కుమారి 21 ఎఫ్ కి మ‌హేష్, ఎన్టీఆర్,.. విషెస్ తెలియ‌చేయ‌డంతో ఈ సినిమా పై మ‌రింత క్రేజ్ పెరిగింది. అయితే కుమారి 21 ఎఫ్ సినిమాని ఈ నెల 30న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న రిలీజ్ వాయిదా ప‌డింది. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించిన‌ కుమారి 21 ఎఫ్ ఆడియోను ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ చేసి...సినిమాని న‌వంబ‌ర్ 13న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

మళ్లీ 'బ్రూస్ లీ' విషయంలోనే..

'రచ్చ'దగ్గర్నుంచి రామ్ చరణ్ కెరీర్ ని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.అదేమిటంటే..సినిమా సినిమాకి మధ్య కనీసం ఏడాదిలోపు గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం.

'బ్రూస్‌లీ' ఆల‌స్యంగా రావాల‌ని ఒక‌రోజు..బాగుండాల‌ని మ‌రోరోజు

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, ర‌కుల్ జంట‌గా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో దాన‌య్య డి.వి.వి నిర్మించిన చిత్రం 'బ్రూస్‌లీ ద ఫైట‌ర్‌'. ఎల్లుండి(అక్టోబ‌ర్‌16న‌) ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది.

హిట్ ఇస్తేనే మ‌హేష్ రెండో ఛాన్స్‌ ఇస్తాడా?

మ‌హేష్‌బాబుతో సినిమా చేసే అవ‌కాశం ఓ సారి రావ‌డ‌మే అదృష్టంగా భావిస్తారు ద‌ర్శ‌కులు అయినా.. క‌థానాయిక‌లైనా. ఇక రెండోసారి ఛాన్స్ ద‌క్కితే వారి ఆనందం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నాన్నకు ప్రేమతో..సినిమా చేస్తున్నారు.ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.

చ‌ర‌ణ్ టార్గెట్ 102

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడుగా టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైన రామ్‌చ‌ర‌ణ్ త‌న తొలి చిత్రం 'చిరుత'తో ఆక‌ట్టుకున్నాడు.