'కుమారి 21F' మళ్ళీ రిపీటవుతుందా ?

  • IndiaGlitz, [Thursday,December 21 2017]

'కుమారి 21F' లాంటి యూత్ ఫుల్ & సెన్సేషనల్ హిట్ అనంతరం ఆ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్, కథానాయకుడు రాజ్ తరుణ్ ల క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీటవ్వనుంది.

ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా రామ్ తాళ్ళూరి ఈ క్రేజీ ప్రొజెక్ట్ ను నిర్మించనున్నారు. 'కుమారి 21F' తరహాలోనే యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో యువతను ఆకట్టుకొనే అంశాలన్నీ పుష్కలంగా ఉండడం విశేషం.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. "హిట్ కాంబినేషన్ పల్నాటి సూర్య ప్రతాప్-రాజ్ తరుణ్ ల కాంబినేషన్ లో మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.2గా రూపొందించనుండడం ఆనందంగా ఉంది.

సూర్యప్రతాప్ చెప్పిన కథ విని ఎంతగానో ఎగ్జయిట్ అయ్యాను, యూత్ ఫుల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న రోమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది."కుమారి 21F"ను మించిన స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది" అన్నారు.

రామ్ తాళ్ళూరి ఇటీవల రవితేజ-కళ్యాణ్ కృష్ణల కాంబినేషన్ లో ఒక సెన్సేషన్ ప్రొజెక్ట్ ను ఎనౌన్స్ చేసారు.

More News

సినిమా చూశాను.. డెఫనెట్ గా సూపర్ హిట్ అవుతుంది - 'హలో' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి

యూత్ కింగ్ అఖిల్,కళ్యాణి ప్రియదర్శిని కాంబినేషన్లో అన్నపూర్ణ స్టూడియోస్,'మనం'ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో '

12 ఏళ్ల 'జై చిరంజీవ'

జగదేక వీరుడు అతిలోక సుందరి,చూడాలని ఉంది,ఇంద్ర వంటి హ్యాట్రిక్ విజయాల తరువాత మెగాస్టార్ చిరంజీవి,

సాయిపల్లవి కల నెరవేరినట్టే

కలలు అందరూ కంటారు.అయితే..కొన్ని కలలు మాత్రమే సాకారం అవుతాయి.

సూర్య తో జత కడుతున్న సాయి పల్లవి

సూర్య హీరోగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న తాజా చిత్రం సంకాంతికి ప్రారంభం కానుంది. ఇది సూర్య 36వ సినిమా. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేశారు.

బిల్‌గేట్స్ ప్రశంసలు పొందిన భారతీయ చిత్రం

ఈ మధ్య ఇండియన్ సినిమాల్లో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కంటెంట్ ప్రధానంగా ఉండే సినిమాలు రూపొందుతున్నాయి. అటువంటి సినిమాల్లో అక్షయ్‌కుమార్, భూమి పెడ్నేకర్ నటించిన 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ' ఒకటి.