సుకుమార్ 'కుమారి 21ఎఫ్' టాకీపార్ట్ పూర్తి

  • IndiaGlitz, [Wednesday,September 02 2015]

వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న యువ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి కుమారి 21 ఎఫ్' పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందిస్తున్నాడు.

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో యూత్‌లో మంచి గుర్తింపును పొందిన రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత కెరటం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, ఆర్య, రోబో, వన్, లింగా వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన రత్నవేలు ఈ చిత్రానికి ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీపార్ట్‌ను పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు సుకుమార్ మాట్లాడుతూ ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. నేటి యూత్‌తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు ఇందులో వున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. రాజ్ తరుణ్ పాత్ర, అభినయం అందర్ని ఆకట్టుకునే విధంగా వుంటుంది' అని తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ సుకుమార్ భాగస్వామ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించడమే ఆనందంగా వుంది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న చిత్రమిది. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది. రాజ్‌తరుణ్ కెరీర్ ఈ చిత్రం మరో మైలురాయిగా నిలుస్తుంది. సుకుమార్ మార్క్‌లో కొనసాగే ఈ ప్రేమకథా చిత్రం అన్ని వర్గాల వారిని ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకం వుంది. పాట మినహా చిత్రీకరణ పూర్తయింది.

బ్యాలెన్స్ పాటను త్వరలోనే చిత్రీకరించి అక్టోబర్‌లో దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు. రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్, సమర్పణ: సుకుమార్, నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి,కథస్కీన్‌ప్లే-మాటలు: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్.

More News

దటీస్ పవన్ కళ్యాణ్... (స్పెషల్ స్టొరీ)

హీరోలకు అభిమానులు ఉండడం సహజం. కానీ కొంత మందికి మాత్రమే వీరాభిమానులు ఉంటారు. వారు తమ హీరో కోసం ఏం చేయడానికైనా రెడీ అంటారు.

ప‌వ‌న్ కోస‌మే సాయిధ‌ర‌మ్ తేజ‌తో సినిమాలా..?

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌రమ్ తేజ్ రేయ్ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆత‌ర్వాత ఎ.ఎస్.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ తేజ హీరోగా పిల్లా నువ్వులేని జీవితం సినిమాని దిల్ రాజు నిర్మించారు.

లారెన్స్ హీరోయిన్ తో పవర్ స్టార్...

కాంచన, అధినాయకుడు, బలుపు వంటి చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను తన సోయగాలతో అలరించిన సొగసరి లక్ష్మీరాయ్ ప్రస్తుతం లక్కీఛాన్స్ కొట్టేసింది.

భారీ బడ్జెట్ కు ప్లాన్ చేస్తోన్న మంచు హీరో...

‘ఢీ, దూసుకెళ్తా, అనుక్షణం, రౌడీ’..వంటి డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో మంచు విష్ణు.

పోలెండ్ వెళుతున్నసూర్య...

తమిళ స్టార్ సూర్య హీరోగా మనం ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ‘24’ సినిమా రూపొందుతోంది. సమంత హీరోయిన్ గా నటిస్తుంది.