తుంటరి దర్శకుడి తదుపరి చిత్రం...

  • IndiaGlitz, [Monday,March 14 2016]

గుండెల్లో గోదారి చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై తొలి ప్ర‌య‌త్నంలోనే అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడిగా గుర్తింపు ఏర్ప‌రుచుకున్న‌యువ ద‌ర్శ‌కుడు కుమార్ నాగేంద్ర‌. ఆత‌ర్వాత జోరు అనే సినిమా తీసిన‌ప్ప‌టికీ విజ‌యాన్నిఅందుకోలేపోయాడు. తాజాగా నారా రోహిత్ తో తుంట‌రి సినిమాని తెర‌కెక్కించాడు. ఇటీవ‌ల రిలీజైన తుంట‌రి సినిమాకి బాక్సాఫీస్ వ‌ద్ద మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది.
ఇదిలా ఉంటే...డైరెక్ట‌ర్ కుమార్ నాగేంద్ర‌ త‌న త‌దుప‌రి చిత్రం కోసం హీరో నితిన్ కి ఓ క‌థ చెప్పాడ‌ట‌. నితిన్ ప్ర‌స్తుతం అ ఆ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే 6న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత ఏ విష‌యం చెబుతానన్నాడ‌ట‌. నితిన్ తో పాటు సాయిథ‌ర‌మ్ తేజ్ కి కూడా కుమార్ నాగేంద్ర క‌థ చెప్పాడ‌ట‌. సాయిథ‌ర‌మ్ తేజ్ సుప్రీమ్ సినిమా బిజీలో ఉన్నాడు. తేజు కూడా సుప్రీమ్ రిలీజ్ త‌ర్వాత చెబుతానన్నాడ‌ట‌. మ‌రి..కుమార్ నాగేంద్ర‌కి నితిన్ - సాయిథ‌ర‌మ్ తేజ్ ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారో చూడాలి.

More News

హెబ్బా పటేల్ నాయికగా లక్కీ మీడియా పతాకంపై 'నేను నా బాయ్ ఫ్రెండ్స్'

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం ఆరంభించిన బెక్కెం వేణుగోపాల్ (గోపి) అప్పట్నుంచీ వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.

చిరు 150వ మూవీలో హీరోయిన్ ఫిక్స్..

మెగస్టార్ చిరంజీవి 150వ సినిమా చేయడం ఖాయం అని తెలిసినప్పటి నుంచి ఈ క్రేజీ మూవీకి డైరెక్టర్ ఎవరు..?

అమల పెరుగుతోంది!

కెరీర్ లో బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిలైంది అమలాపాల్.

షాక్ ఇచ్చిన ప్ర‌భాస్..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 సినిమాలో న‌టిస్తూ...ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత బిజీలో కూడా ప్ర‌భాస్ త‌న ఇంట్లో ప‌నిచేసే ప‌ని మ‌నిషి పెళ్లికి హాజ‌రై అక్క‌డున్న వారికి షాక్ ఇచ్చాడు.

విష్ణు - రాజ్ త‌రుణ్ మూవీ టైటిల్...

మంచు విష్ణు - రాజ్ త‌రుణ్ వీరిద్ద‌రు క‌ల‌సి ఓ సినిమా చేస్తున్నవిష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.