ఉద్యోగులను తొలగించొద్దు..: కంపెనీలకు కేటీఆర్ విజ్ఙప్తి

ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీల్లోని ఉద్యోగులను తొలగించవద్దని పరిశ్రమ వర్గాలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పారిశ్రామిక వర్గాలకు ప్రత్యేకంగా కేటీఆర్ ప్రత్యేకంగా లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించకూడదని పారిశ్రామిక వేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. అవసరమైతే తమ ఇతర వ్యయాలను తగ్గించుకుని ఉద్యోగులకు ఈ సంక్షోభ కాలంలో అండగా ఉండాలన్నారు. పరిశ్రమ వర్గాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శనివారం నాడు పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్సు సమావేశం నిర్వహించారు. కరోనా సంక్షోభంలోనూ హెల్త్ కేర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో సరికొత్త అవకాశాలు ఏర్పడ్డాయని మంత్రి తెలిపారు. ఈ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలు పైన ఒక విజన్ డాక్యుమెంట్ ని సిఐఐ తయారు చేయాలని సూచించారు. ప్రస్తుతం సుమారు 25 శాతం ఆర్థిక వ్యవస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తుందన్నారు. లాక్ డౌన్ తర్వతా తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని తాను విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం సమాజంలోని అన్ని వర్గాలకు కరోనా వైరస్ రూపంలో ఒక సవాలు ఎదుర్కొంటుందని ఈ సవాల్‌ను సమిష్టిగా ఎదుర్కొందామని మంత్రి పిలుపునిచ్చారు.

సర్కార్ సిద్ధంగా ఉంది!

లాక్ డౌన్ తర్వతా సైతం అవసరమైన మేరకు పారిశ్రామిక వృద్ది కొనసాగాలంటే వర్క్ ఫోర్సు‌కు నమ్మకం, బరోసా కలిగించడమే అత్యంత పెద్ద సవాళన్నారు. ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలకు అండగా ఉంటుందని మంత్రి కెటియార్ తన లేఖలో పెర్కోన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇందుకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యంగా పిపిఈలు, మాస్కులు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్ల వంటి అన్ని ఏర్పాట్లను చేసిందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

సహకరించండి!

ఇందుకోసం సమాజంలోని పౌరులతో పాటు అన్ని రంగాల మద్దతును ప్రభుత్వం కోరుతున్నదని ఈ సమావేశంలో మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కేర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయోటెక్ ఇండస్ట్రీలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లో ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి సూచించారు. ఈ రంగాలకు సంబంధించి అయా రంగాల్లోని పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలపైన ప్రభుత్వానికి సిఐఐ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ఇవ్వాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు మంత్రి కేటీఆర్ తో సంభాషించారు. ప్రభుత్వం పారిశ్రామికవర్గాలకు ముఖ్యంగా సూక్ష్మ మధ్య తరగతి పారిశ్రామిక రంగానికి మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉన్నదని, ఇప్పటికే ఈ రంగం కొంత ఒత్తిడిలో ఉన్నదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

నేను నమ్ముతున్నా..

ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి తద్వారా ఆర్థిక అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తుందని, పారిశ్రామిక వర్గాల వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వారు అడిగిన పలు అంశాలపైన స్పందించిన మంత్రి కేటీఆర్, ప్రస్తుతం 25 శాతం ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని లాక్ డౌన్ పరిస్థితులు సడలించిన తర్వాత ఆర్థికాభివృద్ధి పుంజుకుంటుదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాలతో కలిసి రావాలని, ముఖ్యంగా క్రిటికల్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించి తమ కంపెనీల సియస్సార్ నిధులను వినియోగించాలని మంత్రి కేటీఆర్ కోరారు.

More News

నూజివీడులో ఇంటింటికీ సరుకులు పంచిన వ్యక్తికి కరోనా

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఊహించని రీతిలో కేసులు పెరిగిపోతున్నాయి. తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా కేసులు సంఖ్య

మహేశ్ స‌ర‌స‌న 'సాహో' బ్యూటీ

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన

ఎన్టీఆర్ బ‌ర్త్ డే ట్రీట్ డౌటే!!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో న‌టిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్

జ‌క్క‌న్న‌తో మ‌హేశ్ ఫిక్స్‌..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ అభిమానుల‌ను చాలా రోజులుగా వేధిస్తోన్న ప్ర‌శ్న‌.. త‌మ అభిమాన హీరోతో ఆల్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సినిమా ఎప్పుడు చేస్తాడు? అని. బాహుబ‌లి స‌మ‌యంలో

'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్‌పై రాజ‌మౌళి సందేహం?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌).