క్షణం రీమేక్ లో నాగ్ హీరోయిన్..

  • IndiaGlitz, [Thursday,April 28 2016]

చిన్న చిత్రంగా రిలీజైన క్ష‌ణం ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. అడ‌వి శేష్ - ఆదా శ‌ర్మ - అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన క్ష‌ణం చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించారు. పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అడ‌వి శేష్ పోషించిన పాత్ర‌ను స‌ల్మాన్ ఖాన్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.
ఇదిలా ఉంటే...ఈ క్ష‌ణం రీమేక్ లో నాగ్ హీరోయిన్ ట‌బు న‌టిస్తుంద‌ట‌. అనసూయ పోషించిన పోలీస్ పాత్ర‌ను టబు పోషిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు ట‌బు కోసం పాత్ర‌లో మార్పులు కూడా చేస్తున్నార‌ట‌. ఇదే క‌నుక నిజ‌మైతే...దృశ్యం హిందీ రీమేక్ లో పోలీస్ గా న‌టించిన ట‌బు..మ‌రోసారి సౌత్ సినిమా హిందీ రీమేక్ లో పోలీస్ గా న‌టిస్తుండ‌డం విశేషం.