ఫిభ్రవరి 26న విడుదలవుతున్న'క్షణం'

  • IndiaGlitz, [Wednesday,February 17 2016]

టాలీవుడ్ నిర్మాణ రంగంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మించే దిశగా అడుగులు వేస్తుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మించిన సస్పెన్స్ డ్రామా క్షణం'. అడవిశేష్,ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడుతుంది. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్, సమంత చేతుల మీదుగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్స్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్ వచ్చింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిభ్రవరి 26న గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నారు.

అడవిశేష్, ఆదాశర్మ, అనసూయ భరద్వాజ, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవివర్మ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి స్టోరీ: అడవి శేష్, ఎడిటింగ్: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు, స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు, అడవి శేష్, సాహిత్యం: సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కెవిన్, అన్నె, దర్శకత్వం: రవికాంత్ పేరెపు.

More News

దిల్ రాజు లైఫ్ యాంబిష‌న్ ఇదే

స‌కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ మంచి చిత్రాల‌ను అందిస్తూ...అభిరుచి గ‌ల నిర్మాత‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు. సునీల్ హీరోగా దిల్ రాజు నిర్మించిన కృష్ణాష్ట‌మి ఈనెల 19న రిలీజ్ అవుతుంది.

మ‌హేష్ ని ఇంప్రెస్ చేసిన పూరి..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాలు ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసాయో తెలిసిందే.

సెన్సార్ లో 'పనిలేని పులిరాజు'

ధన్ రాజ్ 13 పాత్రల్లో నటిస్తున్న ’పనిలేని పులిరాజు‘చిత్రానికి దర్శకుడు చాచా.పాలేపు మీడియా పై.లి పతాకంపై పి.వి.నాగేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ర‌వితేజ మూవీ ఆగిపోవ‌డం గురించి దిల్ రాజు కామెంట్

మాస్ రాజా ర‌వితేజ హీరోగా ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎవ‌డో ఒక‌డు సినిమాను ప్రారంభించారు.

బిజినెస్ ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నస‌ర్ధార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. బాబీ తెర‌కెక్కిస్తున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ బిజినెస్ ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.