షార్ప్ రన్ టైంతో కృష్ణాష్టమి..

  • IndiaGlitz, [Saturday,February 06 2016]
క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ న‌టించిన తాజా చిత్రం కృష్ణాష్ట‌మి. ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వ‌ర్మ తెర‌కెక్కించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు.ఫిబ్ర‌వ‌రి 19న ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఫ‌స్ట్ కాపీ రెడీ చేసారు.
ఇక సినిమా ర‌న్ టైం విష‌యానికి వ‌స్తే...2 గంట‌ల 14 నిమిషాలు అన‌గా 134 నిమిషాలు ర‌న్ టైంగా ఫిక్స్ చేసారు. సునీల్ ఈ సినిమాలో ఎన్నారై గా న‌టించారు. నిక్కీ గార్లాని, డింపుల్ చోపడే హీరోయిన్స్ గా నటించారు. కుటుంబ క‌థా చిత్రానికి యాక్ష‌న్ జోడించి అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా ఈ చిత్రాన్ని వాసు వ‌ర్మ తెర‌కెక్కించారు. అయితే కృష్ణాష్ట‌మి విజ‌యం పై చిత్ర‌టీమ్ చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. మ‌రి..సునీల్ కి కృష్ణాష్ట‌మి విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.