క్రిష్ణాష్టమి రిలీజ్ డేట్ మారింది..

  • IndiaGlitz, [Wednesday,November 18 2015]

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ న‌టిస్తున్నతాజా చిత్రం క్రిష్ణాష్ట‌మి. ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. సునీల్ స‌ర‌స‌న నిక్కి గ‌ల‌రాని, డింపుల్ చోపాడే హీరోయిన్స్ గా న‌టించారు. ఈ చిత్రంలో సునీల్ ఎన్.ఆర్.ఐ గా న‌టించారు.

క్రిష్ణాష్ట‌మి చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ..సంక్రాంతికి ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో.., బాల‌క్రిష్ణ డిక్టేట‌ర్, నాగార్జున సొగ్గాడే చిన్ని నాయ‌నా..చిత్రాలు రిలీజ్ అవుతుండ‌డంతో క్రిష్ణాష్ట‌మి సినిమాని సంక్రాంతికి కాకుండా క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి...క్రిస్మ‌స్ కి వ‌చ్చే క్రిష్ణాష్ట‌మి ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.

More News

'లోఫర్ ' కు భారీ పోటీ...

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తల్లీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'లోఫర్'.ఇందులో వరుణ్ కి తల్లిగా రేవతిగా నటించింది.

నవంబర్ 27న విడుదలవుతున్న 'నేను..నా ప్రేమ కథ'

కె.ఎన్.రావ్ సమర్పణలో శాస్టా మీడియాస్, దత్తాత్రేయ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై శేఖర్, సుష్మ, డయానా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం నేను..నా ప్రేమ కథ.

'శ్రీమంతుడు' సైకిల్ ను విజేతకు అందించిన సూపర్ స్టార్ మహేష్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్,ఎం.బి.ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి.పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని,యలమంచిలి రవిశంకర్,సి.వి.మోహన్(సివిఎం)సూపర్ డూపర్ హిట్ మూవీ 'శ్రీమంతుడు'.

సర్దుకుపోతున్న కాజల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్..ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.వాటిలో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మొదటిసారిగా జోడీకడుతున్న 'సర్దార్ గబ్బర్ సింగ్'కాగా..

బాలయ్య వందో సినిమా టైటిల్ ఇదే..

నందమూరి నట సింహాం బాలక్రిష్ణ ప్రస్తుతం 99వ చిత్రం డిక్టేటర్ లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.