ఫిబ్రవరి 14 న ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకోనున్న సునీల్ - వాసు వర్మ- దిల్ రాజు ల కృష్ణాష్టమి

  • IndiaGlitz, [Saturday,February 13 2016]

చక్కటి డాన్సు ల తో, సూపర్బ్ కామెడీ టైమింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సునీల్ హీరో గా, వాసు వర్మ దర్శకత్వం లో ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న చిత్రం 'కృష్ణాష్టమి'.

ఈ చిత్రం ఫిబ్రవరి19 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14 వ తేదీన ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.

" కేరింత, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సూపర్ సక్సెస్ ని అందించాయి. ఈ రెండు విజయాల అనంతరం వస్తోన్న చిత్రం కృష్ణాష్టమి. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుని మా బ్యానర్ కి హ్యాట్రిక్ విజయం దక్కుతుంది అన్న నమ్మకం ఉంది", అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ, " ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫమిల్య్ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్".

సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, రాజన్ మోడీ, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఈ చిత్రం లో ఉన్నారు.

దర్శకత్వం - స్క్రీన్ప్లే - వాసు వర్మ . నిర్మాత - రాజు . సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు . ఎడిటర్ - గౌతం రాజు . సంగీతం - దినేష్ . కథ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీం . ఫైట్ మాస్టర్ - అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్. నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

More News

జయం రవి సౌతిండియాలో పెద్ద స్టార్ కావాలి - నాని

జయం రవి, లక్ష్మిమీనన్ నటించిన తమిళ చిత్రం ‘మిరుథన్’ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న బ్యానర్ పై తెలుగలో ‘యమపాశం’ పేరుతో విడుదల చేస్తున్నారు. శక్తి సౌందరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ జరిగింది.

సందీప్ కిష‌న్ మూవీ టైటిల్ ఇదే

యువ హీరో సందీప్ కిష‌న్ త‌మిళ్, మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన నేర‌మ్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

రిలీజ్ డేట్ మార్చ‌మంటున్న సూప‌ర్ స్టార్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే హీరోయిన్ గా న‌టిస్తుంది.

హేబా జోరు

కుమారి 21 ఎఫ్ చిత్రంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హేబా పటేల్, ఇప్పుడు వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

లార్గన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగశౌర్య నూతన చిత్రం

కెరీర్‌ ప్రారంభం నుంచి లవ్‌స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాగశౌర్య ఇప్పుడు కథా బలమున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.