నరేంద్ర మోడీకి అభినంద‌న‌లు తెలియ‌చేసిన కృష్ణంరాజు..!

  • IndiaGlitz, [Friday,September 30 2016]

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్ర‌వాద చొర‌బాటు శిబిరాల‌పై మెరుపుదాడులు చేసి విజ‌యం సాధించిన భారత సైన్యానికి దేశం యావ‌త్తు జై కొడుతుంది. ఈ దాడులు గురించి వివ‌రించాడానికి ఏర్పాటు చేసిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో నేత‌లంతా సైన్యాన్ని ప్ర‌శంసించారు. అలాగే భార‌త‌ ప్ర‌ధాని మోడీ నాయ‌క‌త్వం, భార‌త సైన్యం శ‌క్తి సామ‌ర్ధ్యాల‌కు గ‌ర్విస్తున్నాం.

శాంతికి విఘూతం క‌లిగించే అన్ని శ‌క్తుల‌ను తిప్పికొట్ట‌గ‌ల స‌త్తా భార‌త్ కు ఉంది అంటూ ప‌లువురు రాజ‌కీయ నాయ‌క‌లు ప్ర‌శంసించారు. ఇదిలా ఉంటే... పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్ర‌వాద చొర‌బాటు శిబిరాల‌పై మెరుపులు దాడులు చేసి స‌క్సెస్ సాధించినందుకు గాను సీనియ‌ర్ న‌టుడు, మాజీ కేంద్ర‌మంత్రి కృష్ణంరాజు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి అభినంద‌న‌లు తెలియ‌చేసారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో పాటు రాజ్ నాథ్ సింగ్, ప‌రేక‌ర్, అజిత్ డువ్వ‌ల్, ర‌ణ‌భీర్ సింగ్ త‌దిత‌రుల‌ను కృష్ణంరాజు అభినందించారు.