మ‌రోసారి ఆయ‌న‌కే ఓటేసిన క్రిష్‌..!!

  • IndiaGlitz, [Monday,August 17 2020]

లాక్‌డౌన్ స‌మ‌యంలో ద‌ర్శ‌క నిర్మాత క్రిష్ ఖాళీగా ఉన్నాడు. అయితే ఈ ఖాళీ స‌మ‌యాన్ని క్రిష్ ఏమాత్రం వేస్ట్ చేయ‌లేదు. ఆహా ఓటీటీలో కంటెంట్ జ‌న‌రేష‌న‌ల్ కీల‌క పాత్ర పోషించాడు. అయితే ప‌వ‌న్ త‌దుప‌రి సినిమా ఎప్ప‌టి నుండి మొద‌ల‌వుతుంద‌నే దానిపై క్లారిటీ మాత్రం ఇంకా రావ‌డం లేదు. దీంతో క్రిష్ త‌న ద‌ర్శ‌క నిర్మాణంలో స్నేహితుడు రాజీవ్‌రెడ్డితో క‌లిసి ఓ సినిమాను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. న‌ల‌బై రోజుల సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేసేలా ముందుగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న క్రిష్‌.. సినిమాను వెంట‌నే స్టార్ట్ చేసేశాడు.

వికారాబాద్ అడ‌వుల్లో వైష్ణ‌వ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌ల‌పై సినిమా రూపొందుతుంది. అక్టోబ‌ర్ ప్ర‌థ‌మార్థంలోనే షూటింగ్‌ను పూర్తి చేయాల‌నేది క్రిష్ భావిస్తున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి ప్ర‌ముఖ సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నారు. క్రిష్ గ‌మ్యం నుండి ఇప్పుడు చేస్తున్న సినిమాల వ‌ర‌కు చూసుకుంటే ఎక్కువ‌గా కీర‌వాణియే సంగీతం అందించారు. తాజాగా క్రిష్ చేస్తున్న ప‌వ‌న్ సినిమాకు, లేటెస్ట్ వైష్ణ‌వ్‌తేజ్‌, ర‌కుల్ మూవీకి కూడా కీర‌వాణియే సంగీతం అందిస్తున్నారు.ఏదైతేనేం క్రిష్ మ‌రోసారి కీర‌వాణికే ఓటేశారు.