సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నంలో కొరటాల

  • IndiaGlitz, [Tuesday,August 08 2017]

మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ చిత్రాలు త‌ర్వాత దర్శ‌కుడు శివ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌తో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సంద‌ర్భంలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను విమ‌ర్శిస్తూ కొర‌టాల ట్విట్ట‌ర్‌లో చేసిన కామెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ప్ర‌స్తుత‌ రాజకీయాలు చెత్తగా మారాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలను దేవుడు కూడా రక్షించలేడని అన్నారు. కానీ రాజకీయాల్లో మార్పు కోసం మ‌న‌మే ప్ర‌య‌త్నించాలని చెప్పారు. అయితే మ‌రికొంద‌రు మాత్రం కొర‌టాల త‌న సినిమాపై అంచ‌నాలు పెంచుకోవ‌డంలో భాగంగానే ఈ ర‌క‌మైన ట్వీట్ చేశాడ‌ని అంటున్నారు.

డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్యఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఆగస్ట్‌ 11 నుంచి 22 వరకు లక్నోలో జరుగుతుంది. మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌లతోపాటు ప్రముఖ తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలతోపాటు పీటర్‌ హెయిన్స్‌ సారధ్యంలో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరిస్తారు. ఈ సినిమాకు భ‌ర‌త్ అను నేను టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రాన్ని జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More News

సినీ రంగ ప్రవేశం చేయనున్న మంచు వారి మూడోతరం

విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,హీరోగా 600కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈసారి బన్నీ విలన్ వంతు

మెగా ఫ్యామిలీలోని ఎవరైనా ఒక హీరోతో హిట్ కొడితే..

జగపతిబాబు..రిపీట్ అవుతుందా?

లెజెండ్ తో విలన్ గా టర్న్ అయిన ఒకప్పటి కుటుంబ కథా చిత్రాల కథానాయకుడు జగపతిబాబు..

ఈ సారి అయినా చైతూకి ఫలితం మారుతుందా

గతేడాది ప్రేమమ్ తోనూ..ఈ ఏడాది రారండోయ్ వేడుక చూద్దాంతోనూ తన ఖాతాలో చాన్నాళ్ల తరువాత విజయాలను జమ చేసుకున్నాడు నాగచైతన్య.

రీ - రికార్డింగ్ లో సూపర్ స్టార్ మహేష్ 'ఎ.ఆర్.మురుగదాస్ ల 'స్పైడర్'

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్ మధు సమర్పణలో