‘బీబీ 3’..లో బాల‌య్య‌ను ఢీ కొట్ట‌నున్న కోలీవుడ్ స్టార్‌..!

  • IndiaGlitz, [Monday,March 29 2021]

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో మూడో చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా క‌ర్ణాట‌క‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని మే 28న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. మేజ‌ర్ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్తి కాగానే.. ఒక‌వైపు సినిమాను పూర్తి చేస్తూనే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేయాల‌నేది ప్లానింగ్‌గా క‌నిపిస్తోంది. ఈ సినిమాలో ఇద్ద‌రు మెయిన్‌ విల‌న్స్ న‌టించ‌నున్నారు. అందులో ఒక‌డు శ్రీకాంత్ అని యూనిట్ ప్ర‌క‌టించింది. ఇప్పుడు కోలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు శ‌రత్‌కుమార్ మ‌రో విల‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ట‌.

ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. మ‌రో హీరోయిన్ పూర్ణ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ సినిమాకు గాడ్ఫాద‌ర్ అనే టైటిల్ దాదాపు ఖ‌రారైందని, ఉగాదికి ఈ సినిమా టైటిల్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేస్తుంద‌ని స‌మాచారం. సింహ, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More News

‘వకీల్‌సాబ్’ ట్రైలర్: పవన్ ఎంట్రీయే దుమ్ములేచిపోయింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌‌ను కంప్లీట్ చేస్తోంది.

మైక్ మూవీస్, సొహైల్ కాంబోలో సినిమా.. హీరోయిన్‌గా...

‘బిగ్‌బాస్’ ఫేం సయ్యద్ సొహైల్ రియాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది.

‘ఎవర్‌ గివెన్’ నౌక విషయంలో గుడ్ న్యూస్..

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ నౌక ‘ఎంవీ ఎవర్‌ గివెన్ విషయంలో ఓ గుడ్ న్యూస్ తాజాగా వినవస్తోంది.

రోజాకు రెండు మేజర్ సర్జరీలు : వెల్లడించిన సెల్వమణి

నగరి ఎమ్మెల్యే రోజాకు సడెన్‌గా ఏమైందో తెలియదు కానీ ఆమె ఒకటి కాదు రెండు అది కూడా మేజర్ సర్జరీలు చేయించుకున్నారని ఆమె భర్త సెల్వమణి

లగ్జరీ కారు కొన్న ప్రభాస్.. దాని ధర ఎంతో తెలిస్తే...

‘బాహుబలి’ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజే మారిపోయింది. ఆ తరువాత చేసిన ‘సాహో’ తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా కూడా ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రం బాగా దగ్గరయ్యారు.