ప‌వ‌న్ 27లో పాట‌లు ఎన్నంటే?

  • IndiaGlitz, [Friday,June 26 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ను ‘వ‌కీల్‌సాబ్‌’గా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. మ‌రో ప‌క్క రీసెంట్‌గానే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ త‌న 27వ సినిమాను స్టార్ట్ చేసినట్లు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఈలోపు క‌రోనా వైర‌స్ విజృంభించ‌డంతో రెండు సినిమాల షూటింగ్‌ల‌ను ప‌వ‌న్ ఆపేశారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ సినిమా ట్రాక్ ఎక్కనుంది. ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

తాజాగా సినీ వ‌ర్గాల్లో ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అదేంటంటే..ఈ సినిమాకు ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పార్ట్ కంప్లీట్ అయ్యింద‌ని టాక్‌. ఈ సినిమాలో రెండు పాట‌లే ఉంటాయ‌ని అంటున్నారు. ఇందులో ప‌వ‌న్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

ర‌వితేజ రిస్క్ తీసుకుంటాడా?

మాస్ మహారాజా అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రవితేజ ఒక పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్‌4 వ్యాఖ్యాత‌గా సమంత‌..?

తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న‌ ఈ రియాలిటీ షో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది.

డిజిట‌ల్ రంగంపై క‌న్నేసిన అగ్ర నిర్మాణ సంస్థ‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో యువీ క్రియేష‌న్స్ ఒక‌టి. వంశీ, ప్ర‌మోద్‌, విక్ర‌మ్‌లు ఈ బ్యాన‌ర్‌పై సినిమాల‌ను రూపొందించే సంగ‌తి తెలిసిందే.

ఓ స్టార్ హీరోతో ‘షాడో’ను రూపొందించనున్నాం: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్

మధుబాబు రచించిన తెలుగు నవల ‘షాడో’ ఇప్పుడు దృశ్యరూపంగావించబడుతోంది. అతి పెద్ద నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్స్

రాజేష్‌ టచ్‌రివర్‌ దర్శకత్వంలో 'సైనైడ్‌'

జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్‌ టచ్‌రివర్‌ ప్రకటించిన కొత్త సినిమా 'సైనైడ్'.