Kishan Reddy:పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి

  • IndiaGlitz, [Monday,December 11 2023]

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఆ కూటమి ఓడిపోవడం.. జనసేన అభ్యర్థులు ఒక్కరూ గెలవలేకపోయారు. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జోరుగా ప్రచారం జరిగింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కిషన్ రెడ్డి స్పందించారు.

అందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ నిర్ణయం రెండు పార్టీలు ఆలోచించి తీసుకున్నదే. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే మేము.. జనసేనతో కలిసి బరిలో దిగాం. అయితే ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కొందరు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను అని ఆయన ట్వీట్ చేశారు.

తెలంగాణలో అంతగా బలం లేని జనసేన పార్టీతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుందని ఎన్నికలకు ముందే అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఆ పార్టీతో పొత్తు బీజేపీకి నష్టం చేకూరుస్తుందనే వాదనలు వినిపించాయి. అయితే ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే జనసేనతో కలిసి బరిలో దిగామని కిషన్ రెడ్డి తెలిపారు. కాగా 119 నియోజకవర్గాలకు గాను బీజేపీ 111, జనసేన 8 స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ గతంలో కంటే 7 స్థానాలు ఎక్కువ గెలిచి 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక జనసేన మాత్రం పోటీ చేసిన 8 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది. దీంతో తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ పీకింది ఏం లేదని.. కనీసం ఆయన ప్రచారం చేసిన చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరిగింది.

More News

Bigg Boss Telugu 7 : బిగ్‌బాస్ నుంచి శోభాశెట్టి ఎలిమినేషన్.. శివాజీ కాళ్ల మీద పడి క్షమాపణలు , ఫైనలిస్టులు వీళ్లే

అనుకున్నట్లుగానే బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ నుంచి శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యింది.

Balineni:మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నాను.. బాలినేని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నీతిమంతుడినని చెప్పడం లేదని..

Ram Charan : రామ్‌ చరణ్‌కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం .. ‘పాప్ గోల్డెన్ అవార్డ్’ అందుకున్న మెగా హీరో

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఫైట్లు, డ్యాన్స్, నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్.

CM Revanth Reddy:మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Telangana Congress: కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుల భారం.. గ్యారంటీలు నెరవేర్చడం సాధ్యమేనా..?

తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు వచ్చేశాయి. కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లింది.