విశాఖపట్నంలో వైభవంగా 'కిరాక్ పార్టీ' సక్సెస్ సెలబ్రేషన్స్ !!

  • IndiaGlitz, [Sunday,March 25 2018]

నిఖిల్, సిమ్రాన్, సంయుక్త హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'కిరాక్ పార్టీ'. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. మార్చి 16న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సొంతం చేసుకొంది.

అన్నీ వర్గాల ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరించి ఉండడంతో.. చిత్ర బృందం సక్సెస్ టూర్ ని నిర్వహించింది. అందులో భాగంగా వైజాగ్ లో సక్సెస్ పార్టీ నిర్వహించింది. అక్కడ ఓ పబ్లిక్ ప్లేస్ లో నిర్వహించిన సక్సెస్ ఈవెంట్ కు వందల సంఖ్యలో స్టూడెంట్స్ హాజరయ్యారు. ఆ సందర్భంలో స్టూడెంట్స్ అందరితో క్వశ్చన్ & ఆన్సర్ సెషన్ నిర్వహించి, అందులో గెలుపొందినవారికి సెల్ఫీని ఇచ్చాడు హీరో నిఖిల్ & టీం.

ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. థియేటర్ లో ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఫస్ట్ వీక్ లోనే బయ్యర్స్ అందరికీ బ్రేక్ ఈవెన్ తెచ్చిపెట్టిన చిత్రమిది. సెకండ్ వీక్ లో కూడా మంచి కలెక్షన్స్ తో ఆడుతోంది. స్టూడెంట్స్ మాత్రమే కాక అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్న సినిమా కిరాక్ పార్టీ. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన మా నిర్మాత అనిల్ సుంకరగారికి, డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టికి కృతజ్నతలు చెప్పుకొంటున్నాను. హ్యాపీ డేస్ తర్వాత నేను నటించిన ప్యూర్ కాలేజ్ ఎంటర్ టైనర్ కిరాక్ పార్టీ. సినిమా చూడనివాళ్లు ఈ చిత్రాన్ని చూడాలని కోరుకొంటున్నాను అన్నారు. 

కథానాయకి సిమ్రాన్ మాట్లాడుతూ.. మా 'కిరాక్ పార్టీ' చిత్రాన్ని, ఆ చిత్రంలో నేను పోషించిన మీరా పాత్రను ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగులో నా పరిచయ చిత్రంతోనే ఇంతటి ఘన విజయం సొంతం చేసుకోవడం చాలా సంతోషం. వైజాగ్ లో క్రౌడ్ చూస్తుంటే షాకింగ్ గా ఉంది. నా డెబ్యూ మూవీకే ఈస్థాయిలో ప్రేక్షకులు ఆదరించడాన్ని ఎప్పటికీ మరువలేను అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో స్నేహితుల పాత్రల్లో నటించిన నటీనటులందరూ సక్సెస్ ఈవెంట్ కి విచ్చేసిన స్టూడెంట్స్ అందరితో సరదాగా గడిపు, ఆడిపాడి అందర్నీ ఉత్సాహపరిచారు. 

More News

'నీది నాది ఒకే కథ' లాంటి గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్‌ - ప్రముఖ దర్శకులు

'అప్పట్లో ఒకడుండేవాడు'లాంటి డిఫరెంట్‌ చిత్రాన్ని నిర్మించిన ఆరాన్‌ మీడియా వర్క్స్‌ సంస్థ లేటెస్ట్‌గా 'నీది నాది ఒకే కథ' వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు.

మహేష్‌ 'భరత్‌ అనే నేను' మొదటి పాట విడుదల

మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'.

'నేల టిక్కెట్టు' మే 24న విడుదల

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో, రాజా ది గ్రేట్‌తో అదరగొట్టిన మాస్ మహారాజా రవితేజ

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్ మ‌ల్టీస్టార‌ర్‌

విభిన్న‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ కొత్త‌దనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్ట‌రీ వెకంటేశ్‌... ఫిదా, తొలి ప్రేమ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించిన యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ .

క్రైమ్ కామెడీ జోన‌ర్‌తో సునీల్‌?

కామెడీ హీరో సునీల్  హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచిన చిత్రం 'పూలరంగడు'. ఈ చిత్రాన్ని వీరభద్రమ్‌ చౌదరి తెరకెక్కించారు.