ఖుషీ సీక్వెల్ గురించి రేణు రియాక్షన్..

  • IndiaGlitz, [Wednesday,March 16 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - ఎస్.జె.సూర్య కాంబినేష‌న్లో తాజాగా ఖుషీ సీక్వెల్ రూపొందించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం కోసం ముంబాయిలో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. ర‌చ‌యిత ఆకుల శివ‌, అనూప్ రూబెన్స్, ఎస్.జె.సూర్య‌, రామ‌జోగయ్య శాస్త్రి ఈ న‌లుగురు ప‌వ‌న్ సినిమా కోసం ముంబాయిలో మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నామ‌ని సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో తెలియ‌చేసారు.
దీంతో ఖుషీ సీక్వెల్ మ్యూజిక్ సిట్టింగ్స్ ముంబాయిలో చేయ‌డానికి కార‌ణం ఈ చిత్రానికి రేణు దేశాయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డ‌మే అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అలాగే ప‌వ‌న్ ఇక రెండు మూడు సినిమాలు మాత్ర‌మే చేస్తాను ఆత‌ర్వాత సినిమాలు చేయ‌ను అని ప్ర‌క‌టించారు. అందుచేత రేణు దేశాయ్ కి ఫైనాన్షియ‌ల్ స‌పోర్ట్ ఇవ్వ‌డం కోస‌మే ప‌వ‌న్ ఖుషీ సీక్వెల్ మూవీకి రేణు దేశాయ్ ని నిర్మాత చేయ‌నున్నారంటూ మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వార్త‌ల గురించే అనుకుంట రేణు దేశాయ్ ట్విట్ట‌ర్ లో ...నిజ‌మైతే నేనే ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తాను. అంతే కానీ ఏదేదో ఊహించుకోకండి అంటూ స్పందించారు. అదీ సంగ‌తి.