‘ఖైదీ’ సెన్సార్‌ పూర్తి , అక్టోబర్‌ 25 విడుదల

  • IndiaGlitz, [Wednesday,October 23 2019]

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ’ఖైదీ’. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. దీపావళి కానుకగా అక్టోబర్‌ 25న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ “ఖైదీ’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 25న విడుదల చేస్తున్నాం. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సాగే వెరైటీ సినిమా ఇది. విభిన్నమైన చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ‘ఖైదీ’ చిత్రానికి కూడా అఖండ విజయాన్ని చేకూరుస్తారన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆరట్స్‌ బేనర్‌పై ’ఖైదీ’ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సి.ఎస్‌., సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌, ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌, రిలీజ్‌: శ్రీసత్యసాయి ఆరట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌, దర్శకత్వం: లోకేష్‌ కనకరాజ్‌.

More News

`విజిల్` చిత్రాన్ని మ‌హిళ‌ల‌కు అంకిత‌మిస్తున్నాను - డైరెక్ట‌ర్ అట్లీ

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం `విజిల్‌``. పోలీస్‌(తెరి), అదిరింది(మెర్స‌ల్‌) వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాల త‌ర్వాత విజ‌య్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో

బాబూ.. రాజీనామా చేసి కుప్పంలో గెలవండి చూద్దాం!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై.. టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రభాస్‌కు చెర్రీ, రానా బర్త్ డే విషెస్ ఎలా చెప్పారంటే..!

ఆరడగుల బుల్లెట్.. అందం, అభినయం ఆయనకే సొంతం.. తానే స్టార్ హీరో అని ఫీలింగ్ లేకుండా అందరితో కలిసిమెలిసి..

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఆవిష్కరించిన ‘మత్తు వదలరా’ ఫస్ట్ లుక్

సంగీత దిగ్గజం ఎమ్.ఎమ్. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మత్తు వదలరా’.

దీపావళికి విజయశాంతి సర్‌ఫ్రైజ్!

అలనాటి సీనియర్ నటి.. ప్రస్తుత మహిళా నాయకురాలు విజయశాంతి మళ్లీ నటనవైపు మొగ్గు చూపి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో